AP Politics : మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం.. ఆ కూట‌మి వైసీపీని ఏం చేయ‌లేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Politics : మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం.. ఆ కూట‌మి వైసీపీని ఏం చేయ‌లేదు..!

AP Politics : మాధవి లత  ఈమె మొదట తెలుగు సినీ ఇండస్ట్రీలో నచ్చావులే అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2008లో విడుదలైన ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలో స్నేహితుడా అరవింద 2 సినిమాల్లో కూడా నటించి అలరించారు. అనంతరం కొన్నాళ్లపాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె 2018లో బీజెపీ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో […]

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Politics : మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం.. ఆ కూట‌మి వైసీపీని ఏం చేయ‌లేదు..!

AP Politics : మాధవి లత  ఈమె మొదట తెలుగు సినీ ఇండస్ట్రీలో నచ్చావులే అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2008లో విడుదలైన ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలో స్నేహితుడా అరవింద 2 సినిమాల్లో కూడా నటించి అలరించారు. అనంతరం కొన్నాళ్లపాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె 2018లో బీజెపీ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు . అయితే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా సినీ నటి బీజెపీ నాయకురాలు మాధవి లత ఏపీ రాజకీయాలపై స్పందించారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన ఆమె ముక్కు సూటిగా సినీ ఇండస్ట్రీపై పలు రకాల అభిప్రాయాలను బయటకు చెప్పడంతో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు అని చెప్పొచ్చు.

అయినప్పటికీ తనవు వెనకడుగు వేయకుండా అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగు రాష్ట్రాల్లో బీజెపీ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మి బరిలోకి దిగారు. ప్రస్తుతం ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు రేసులో ముందున్నారు అని కూడా చెప్పాలి. ఇక ఇదే విషయాన్ని అనేక రకాల జాతీయ సంస్థలు సర్వేలు కూడా చేసి వెల్లడించాయి. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు మాత్రం బీజెపీ మరియు జనసేనతో కూటమిగా ఏర్పడి బరిలోకి దిగారు. ఇలాంటి తరుణంలో ఆంధ్ర రాజకీయాలపై తాజాగా మాధవి లత స్పందిస్తూ…ఆంధ్ర రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీడీపీ జనసేన బీజెపీ కలిసి పోటీ చేస్తున్నాయని , ఇక ఈ మూడు పార్టీలు పొత్తులో కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి గెలిచేద్దాం అంటే సబవు కాదని ఆమె తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అంత ఈజీ కాదని, ఎందుకంటే సీఎం జగన్ కు చాలా రాజకీయ పరిణామాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాక ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్ చాలా చేశారని దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో డబ్బు ఖర్చు పెట్టినా కూడా వైయస్ జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడం కాస్త కష్టమే అని చెప్పాలి. మూడు పార్టీలు కలిసాయి కదా కచ్చితంగా గెలుస్తాం ఇంకేం ఉందిలే అనుకుంటే కుదరదని ఆమె తెలియజేశారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలసి గ్రౌండ్ లెవెల్ నుండి నిరంతరం కష్టపడి పని చేసినా కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా జగన్ ను ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీలు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆమె తెలియజేశారు. అయితే అసలు సీట్లు రావా అంటే కచ్చితంగా వస్తాయి కానీ గెలుపు వస్తుందా రాదా..? అధికారం వస్తుందా రాదా..? అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఉన్న బలమంతా కూడ కట్టుకుని కష్టపడితే తప్ప ప్రస్తుతం జగన్ ను ఎవరు ఓడించలేరని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి సినీ నటి మాధవి లాత చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది