
Anchor Shyamala : యాంకరమ్మ చల్లబడిందిగా.. దిగొచ్చి పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేసిందిగా..!
Anchor Shyamala : ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ చాలా మంది సెలబ్రిటీలు ప్రచారంలో పాల్గొనడం మనం చూశాం. కొందరు వైసీపీకి సపోర్టుగా క్యాంపెయిన్ నిర్వహించారు. మరికొందరు కూటమికి సపోర్ట్ చేశారు. అయితే వైసీపీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన వారిలో యాంకర్ శ్యామల ఉన్నారు. ఆమె వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించడంతో పాటు టీడీపీ, పవన్ కల్యాణ్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మైకు పట్టుకుని ఆవేశ పడటం తప్ప.. పవన్ కల్యాణ్ ఎవరికీ సాయం చేయలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పిఠాపురంలో వంగ గీత గెలుపును ఆపే సత్తా పవన్ కల్యాణ్ కు లేదంటూ తీవ్ర విమర్శలు చేసింది.ఏప్రిల్ 11న నెల్లూరులో మొదలైన ఆమె ప్రచారం నెల రోజుల పాటు కొనసాగి మే 11న మళ్లీ నెల్లూరులోనే ముగిసింది.
అయితూ శ్యామల ప్రచారం చేసిన అన్ని చోట్లా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఘోర పరాభవాన్ని చవి చూడటం విశేషం. ఇక ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్కు సపోర్ట్గా ఎన్నో వీడియోలు పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో అన్ని వీడియోలు కనిపించడం లేదు. చాలావరకు డిలీట్ చేసింది. అంతే కాకుండా ఉన్న వీడియోలకు, ఫోటోలకు కూడా కామెంట్స్ ఆప్షన్ను తీసేసింది. దీంతో శ్యామలా ఏమైపోయింది, ఎందుకు సైలెంట్ అయ్యింది అంటూ ఇతర పార్టీ సపోర్టర్స్ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. పిఠాపురంలో వంగా గీతనే గెలుస్తుందని అంత నమ్మకంగా చెప్పిందని, మరి ఇప్పుడు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి అంతలా సపోర్ట్ చేసినందుకు శ్యామలా కెరీర్పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
Anchor Shyamala : యాంకరమ్మ చల్లబడిందిగా.. దిగొచ్చి పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేసిందిగా..!
అయితే రిజల్ట్స్ వచ్చాక తొలిసారి శ్యామల వీడియో విడుదల చేసింది. ఏపీ ప్రజలందరికి నమస్కారం. మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా.. కచ్చితంగా ఎన్నికల క్షేత్రంలో ప్రజల తీర్పే అంతిమం.. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వారికి ధన్యవాదాలలు. కూటమి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ ఎన్నికల్లో మా పార్టీ వైసిపి గెలుపు కోసం అహర్నిశలు పని చేసిన వైసిపి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం గెలిచిననాడు పొంగిపోలేదు ఓడిన నాడు కుంగిపోము మల్లి పుంజుకొని మా నాయకుడు జగన్ అన్న ఆధ్వర్యంలో తిరిగి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక తనకు వచ్చే కాల్స్ పై కూడా స్పందించింది. ఏది వ్యక్తిగతంగా తీసుకోవద్దు. పార్టీకి సాయం చేసే విధంగా ఉన్నదే చెప్పాను. దయచేసి దానిని ఎవరు తప్పుగా అనుకోవద్దు అని శ్యామల పేర్కొంది.
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
This website uses cookies.