Andhra Pradesh Elections : BIG BREAKING.. ఏపీ లో ఎన్నికలు !

 Authored By siddhu | The Telugu News | Updated on :11 April 2026,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Andhra Pradesh Elections : BIG BREAKING : ఏపీ లో ఎన్నికలు !

Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మరోసారి ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసిపోవడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై సీరియస్ గా దృష్టి సారించింది. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ శ్రేణులు ఈ సమరానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Andhra Pradesh Elections : BIG BREAKING.. ఏపీ లో ఎన్నికలు !

Andhra Pradesh Elections : BIG BREAKING.. ఏపీ లో ఎన్నికలు !

Andhra Pradesh Elections : స్థానిక సమరానికి కూటమి వ్యూహరచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100కు పైగా మునిసిపాలిటీలు, 12కు పైగా నగర పాలక సంస్థలకు ఈ ఏడాది ఆగస్టు నాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో 95 శాతం స్ట్రైక్ రేటుతో భారీ విజయం సాధించిన కూటమికి, ఈ రెండేళ్ల కాలంలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశం రాలేదు. అందుకే మునిసిపల్ ఎన్నికల ద్వారా తమ పాలనపై ప్రజల పల్స్ తెలుసుకోవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉంటుంది. మేధావులు, విద్యావంతులు అధికంగా ఉండే నగరాల్లో తమ జైత్రయాత్రను మొదలుపెట్టి, ఆ విజయోత్సాహాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకించాలని కూటమి నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

Andhra Pradesh Elections : ముందుగా పట్టణాలు ఆపై పల్లెలు

రాష్ట్ర క్యాబినెట్ భేటీలో కూడా ఈ స్థానిక ఎన్నికల అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముందుగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తి చేసి, ఆ తర్వాత జిల్లా మరియు మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చివరగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం ద్వారా వరుస విజయాలను నమోదు చేయాలని కూటమి వ్యూహకర్తలు భావిస్తున్నారు. వేసవి తీవ్రత తగ్గిన తర్వాత, అంటే ఆగస్టు నెల నాటికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. దీనికోసం 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని, బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్ నివేదిక అందిన వెంటనే నోటిఫికేషన్ దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Andhra Pradesh Elections పార్టీ శ్రేణులకు చంద్రబాబు లోకేష్ దిశానిర్దేశం

ఎన్నికలు వస్తున్నాయి, ఇక ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అటు నారా లోకేష్ కూడా పార్టీ నేతలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో సెంట్ పర్సెంట్ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది. మరి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష వైకాపా ఏ విధంగా ఎదురుదాడి చేస్తుంది, కూటమి ప్రభంజనాన్ని తట్టుకుని ఎన్ని స్థానాలు దక్కించుకుంటుంది అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఏపీలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగనుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది.

 

siddhu

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి