Exit Polls Results : ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఏ పార్టీ గెలవబోతోందంటే..?

Exit Polls Results : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కౌంటింగ్ ఫలితాలకు ఇంకో మూడు రోజుల సమయం ఉన్నా సరే ముందుగానే ఎగ్జిట్ పోల్స్ రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈ సారి తాజాగా జూన్ 1న సాయంత్రం పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ సారి ఏపీ ఫలితాలపైనే అంరి దృష్టి ఉంది. ఎందుకంటే టఫ్ ఫైట్ జరిగింది కాబట్టి ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఇందలో ఏ పార్టీకి ఏ సంస్థ ఎన్ని సీట్లు ఇచ్చిందో చూద్దాం.

Exit Polls Results ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ( ఏపీ లోక్ సభ)

ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి కేవలం 4 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక అటు టీడీపీ కూటమికి మాత్రం 21 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పింది.

Exit Polls Results సీఎన్ఎన్ న్యూస్ -18 (లోక్ సభ)

ఈ సంస్థ కూడా టీడీపీ కూటమికే ఎక్కువ సీట్లు కేటాయించింది. ఈ సారి టీడీపీ కూటమికి 19 నుంచి 22 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. అటు వైసీపీకి మాత్రం 5 నుంచి 8 సీట్లు వస్తున్నట్టు చెప్పింది.

Exit Polls Results ఆరా ఎగ్జిట్ పోల్స్

ఈ సంస్థ సర్వేలో వైసీపీ ఏపీలో అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పింది. వైసీపీకి ఏకంగా 94 నుంచి 104 సీట్లు వస్తున్నట్టు తెలిపింది. కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక ఎంపీ సీట్లలో కూడా వైసీపీకి 13 నుంచి 15 సీట్లు వస్తాయని, టీడీపీ కూటమికి 10 నుంచి 12 సీట్లు వస్తున్నట్టు తెలిపింది.

Exit Polls Results భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్

ఈ సంస్థ సర్వేలో వైసీపీకి 112 నుంచి 143 సీట్లు వస్తున్నట్టు తెలిపింది. టీడీపీ కూటమికి మాత్రం 32 నుంచి 63 సీట్లు వస్తున్నట్టు తెలిపింది.

Exit Polls Results : ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఏ పార్టీ గెలవబోతోందంటే..?

Exit Polls Results పీపుల్ పల్స్

ఈ సర్వేలో కూడా టీడీపీ కూటమికే అధికారం దక్కుతుందని తెలిపింది. టీడీపీకి 95 -110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీకి 02 నుంచి 05 సీట్లు వస్తున్నట్టు తెలిపింది. వైసీపీకి 45 నుంచి 60 సీట్లు రాబోతున్నట్టు స్పష్టం చేసింది.

పార్థ ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్సార్‌సీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తుందని చెప్పింది. టీడీపీ కూటమికి 55 నుంచి 65 సీట్లు రాబోతున్నట్టు స్పష్టం చేసింది.

టీవీ 9 పోల్ స్ట్రాట్ ఎంపీ స్థానాలు

వైఎస్సార్‌సీపీ కి 13 సీట్లు వస్తాయని టీవీ9 సర్వేలో తెలిపింది. టీడీపీ కూటమి 12 సీట్లు రాబోతున్నట్టు చెప్పింది.

Recent Posts

Amala Paul : నా భ‌ర్తకి నేను హీరోయిన్ అనే విష‌యం తెలియ‌దు అంటూ బాంబ్ పేల్చిన అమ‌లాపాల్..!

Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమ‌లాపాల్‌. తెలుగులో ఆరు సినిమాలే…

5 hours ago

Jr Ntr : ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ఎన్టీఆర్‌ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారేంటి ?

Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విష‌యం మ‌నంద‌ర‌కి తెలిసిందే.. పాకిస్తాన్‌తో…

6 hours ago

Samantha : పెళ్ల‌య్యాక బుద్దొచ్చింది.. నాగ చైత‌న్య చేసిందేమి లేద‌న్న స‌మంత‌..!

Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌-స‌మంత‌లు ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…

7 hours ago

Types Of Kisses : శ‌రీరంపై మీరు పెట్టుకునే ముద్దుతో అవ‌త‌లి వ్య‌క్తిపై మీ ప్రేమ‌ను చెప్పొచ్చు తెలుసా?

Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…

8 hours ago

Dinner Before 7 pm : రాత్రి భోజ‌నం 7 గంట‌ల‌కు ముందే ముగిస్తే క‌లిగే ఆశ్చ‌ర్య‌క‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…

9 hours ago

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ప్ర‌స్తుతం భార‌త్ - పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆపరేషన్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్…

10 hours ago

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు…

11 hours ago

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…

11 hours ago