Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు గడ్డి కొరత, పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న రైతులకు ఇది భారీ ఊరటగా మారనుంది. ప్రభుత్వం హైప్రోటీన్‌ సమీకృత పశు దాణాను 50 శాతం రాయితీ ధరకు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాల ఉత్పత్తిలో పెరుగుదల, పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు రైతుల ఆర్థిక భారాన్ని కూడా తక్కువ చేయగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Farmers రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త ప్రభుత్వం అదిరే కానుక

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers రైతులకు గుడ్ న్యూస్.. పశు దాణాను 50 శాతం రాయితీ ఇస్తున్న ఏపీ ప్రభుత్వం

ఈ పథకంలో భాగంగా నెల్లూరు జిల్లాకు మొత్తం 588 మెట్రిక్ టన్నుల పశు దాణా మంజూరైంది. ఇప్పటికే 250 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయగా, మరో 169 మెట్రిక్ టన్నుల సరఫరా త్వరలోనే జరగనుంది. ఒక్కో 50 కిలోల బస్తా అసలు ధర రూ.1110 కాగా, రైతులకు అది రూ.555కే అందుబాటులో ఉంటుంది. ప్రారంభ దశలో ఒక్కో రైతుకు ఒక్క బస్తా ఇవ్వగా, తదుపరి రెండు విడతల్లో మరో రెండు బస్తాలు అందిస్తారు. ఒక్క రైతుకు రెండు పెద్ద పశువులు, ఒక దూడ ఉన్నట్టు లెక్కించి మొత్తం 150 కిలోల దాణా మంజూరు చేస్తారు.

ఈ రాయితీ పొందేందుకు రైతులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే చిన్న, సన్నకారు రైతులుగా గుర్తింపు ఉండటం అవసరం. రైతులు తమ పేర్లను సమీప రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. అర్హత ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ నిష్పత్తుల మేరకు పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, పాడి పరిశ్రమ అభివృద్ధికి గట్టి బలకేంద్రంగా మారనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది