Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!
ప్రధానాంశాలు:
Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి విపత్తులు, వరదలు, చీడపీడల కారణంగా వారిని తీవ్ర నష్టాలు వెంటాడుతున్నాయి. వరి పంట నుంచి స్థిరమైన ఆదాయం లేకపోవడంతో రైతులు అసంతృప్తిగా ఉన్న వేళ, జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆయిల్పాం సాగును ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తూ, దీర్ఘకాలిక ఆదాయ మార్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆయిల్పాం సాగు ద్వారా రైతులకు మంచి లాభాలొస్తాయని, ఇది ఒక బహుళ వార్షిక పంట కావడంతో ఎన్నాళ్లకైనా ఆదాయం అందించగలదని అధికారులు విశ్వసిస్తున్నారు.

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!
Farmers : రైతులకు చంద్రబాబు రూ.70 వేల సాయం..దీనికి అర్హులు ఎవరంటే !!
ఈ పంట సాగుపై రైతుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించింది. ఒక్క హెక్టారులో 57 మొక్కలను నాటేందుకు అవసరమైన రూ.29,000ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే నాలుగు సంవత్సరాల పాటు మొక్కల సంరక్షణ, ఎరువుల ఖర్చులకు రూ.5,200 చొప్పున మద్దతు అందించనుంది. అంతే కాకుండా మొక్కల మధ్య ఖాళీ ప్రదేశంలో అంతర పంటలు వేసేందుకు కూడా అదనంగా ప్రతి సంవత్సరం రూ.5,200 చొప్పున నాలుగు సంవత్సరాల వరకు అందజేస్తున్నారు. ఈ నిధులు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయనున్నారు. పిఠాపురం, తుని, పెద్దాపురం, శంఖవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు మండలాల్లో లక్షల హెక్టార్లలో ఆయిల్పాం సాగును విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించారు.
ప్రస్తుతం దేశానికి పెద్ద మొత్తంలో పామాయిల్ దిగుమతులు జరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా ఆయిల్పాం ఉత్పత్తిని పెంచితే రైతులకు స్థిరమైన ఆదాయం కలిగించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుంది. ప్రభుత్వ రాయితీలు, సాంకేతిక మార్గదర్శనంతో రైతులు సురక్షితంగా సాగు చేయగలుగుతారు. ఉద్యానశాఖాధికారిణి శైలజ వెల్లడించినట్లు, ఈ పథకంపై అవగాహన పెరిగిన రైతులు పునఃసంఘటనతో ఆయిల్పాం సాగుకు ముందుకు వస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఒక సుదీర్ఘకాలిక మార్పునకు నాంది కాగలదు.