AP Politics : పొత్తు కుదిరింది.. కాని సీట్ల పంచాయ‌తీ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిందే..!

Advertisement
Advertisement

AP Politics : ఈ సారి ఏపీ ఎల‌క్ష‌న్స్ చాలా రంజుగా మార‌బోతున్నాయి. ఏపీలో వైసీపీ ని గద్దె దించే లక్ష్యంతో టీడీపీ -బీజేపీ -జనసేన క‌లిసి పోటీ చేస్తున్నాయి. ప‌దేళ్ల త‌ర్వాత ఈ మూడు పార్టీలు క‌లిసి ప‌ని చేస్తుండ‌డంతో పోటీ ఆస‌క్తిక‌రంగా మార‌నుంది.అయితే పొత్తులో భాగంగా బీజేపీకి 6 పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాలను కేటాయించిన విష‌యం తెలిసిందే. ఇక జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్ కి పోటీ చేయ‌నుంది. ఇంకా మిగిలిన‌వి 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లు కాగా వాటిలో టీడీపీ పోటీ పడ‌నుంది. అయితే మూడు పార్టీల పార్ల‌మెంటు అభ్య‌ర్ధులు ఖ‌రారు కాక‌పోవ‌డంతో అంద‌రిలో సందిగ్ధం నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాము పోటీ చేసే రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటైన కాకినాడకు తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌ ను అభ్యర్థిగా ప్రకటించిన కూడా టీడీపీ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం బీజేపీ ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తుంది.

Advertisement

టీడీపీ, జ‌న‌సేన కోరిన‌వి బీజేపీ కోరుతుండ‌డంతో అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, విజయనగరం ఎంపీ సీట్లను బీజేపీకి ఇవ్వాలని టీడీపీ భావించగా ఇక్క‌డ బీజేపీ కొత్త పాట పాడుతుంది. అనకాపల్లి ఎంపీ స్థానానికి బదులు విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని, విజయనగరంకు బదులుగా అమలాపురం పార్లమెంటు సీటును బీజేపీ కోరుతుంద‌ని టాక్ న‌డుస్తుంది. అలానే అనపర్తి, పాడేరు, ఆదోని, గుంటూరు పశ్చిమ, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను బీజేపీ కోరుతోందని చెబుతున్నారు. అయితే ఆ సీట్లు చంద్ర‌బాబు త‌మ పార్టీ అభ్య‌ర్ధుల‌కి కేటాయించ‌గా వాటిని బీజేపీ కోరుతుండడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

బీజేపీ ప‌ట్టుబ‌డితే సీట్ల మార్పు త‌ప్ప‌క జ‌రుగుతుంద‌ని అంటున్నారు. జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ఆ పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించ‌గా, ఇందులో ఏడు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆ సీట్ల‌లో కొన్నింటిని బీజేపీ కోరుతుంద‌ని టాక్ న‌డుస్తుంది. వాటి గురించి చ‌ర్చించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తదితర నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసి పోటీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సమర్పించారని అదిష్టానం నిర్ణ‌యం త‌ర్వాత మ‌ళ్లీ కొత్త‌గా అభ్య‌ర్ధుల‌ని ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. దీనికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం కూడా ఉంద‌ని టాక్. బీజేపీ పోటీ చేసే స్థానాల పేర్లు ఈ గ్యాప్‌లో ఫిక్స్ చేస్తే ఆ వెంట‌నే జనసేన, టీడీపీ తాము పోటీ చేసే సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Recent Posts

India EU Free Trade Agreement 2026 : భారత్-ఈయూ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం: భారీగా తగ్గనున్న కార్లు, మద్యం ధరలు

India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…

4 hours ago

Union Budget 2026 : అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…

5 hours ago

Redmi Note 15 Pro 5G : రెడ్మీ నోట్ 15 ప్రో 5జీ.. 29న గ్రాండ్ ఎంట్రీ.. 200 MP కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్..

Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్‌లో మరో హాట్ అప్‌డేట్‌కు…

6 hours ago

Pakistan : టీ20 వరల్డ్ కప్‌పై సస్పెన్స్.. భారత్-పాక్ మ్యాచ్ ఉందా?.. లేదా ?

pakistan : టీ20 వరల్డ్ కప్  india vs pakistan t20 world cup 2026  ప్రారంభానికి ఇంకా రెండు…

7 hours ago

Telangana: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే..!

Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

8 hours ago

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…

8 hours ago

Survey : ఏపీ లో సంచలనం సృష్టిస్తున్న సర్వే .. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చెయ్యబోతున్న వైసీపీ

Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…

9 hours ago

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

10 hours ago