AP Politics : ఈ సారి ఏపీ ఎలక్షన్స్ చాలా రంజుగా మారబోతున్నాయి. ఏపీలో వైసీపీ ని గద్దె దించే లక్ష్యంతో టీడీపీ -బీజేపీ -జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. పదేళ్ల తర్వాత ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తుండడంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.అయితే పొత్తులో భాగంగా బీజేపీకి 6 పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే. ఇక జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్ కి పోటీ చేయనుంది. ఇంకా మిగిలినవి 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లు కాగా వాటిలో టీడీపీ పోటీ పడనుంది. అయితే మూడు పార్టీల పార్లమెంటు అభ్యర్ధులు ఖరారు కాకపోవడంతో అందరిలో సందిగ్ధం నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాము పోటీ చేసే రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటైన కాకినాడకు తంగెళ్ల ఉదయశ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించిన కూడా టీడీపీ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం బీజేపీ ప్రధాన కారణంగా తెలుస్తుంది.
టీడీపీ, జనసేన కోరినవి బీజేపీ కోరుతుండడంతో అసలు సమస్య వచ్చింది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, విజయనగరం ఎంపీ సీట్లను బీజేపీకి ఇవ్వాలని టీడీపీ భావించగా ఇక్కడ బీజేపీ కొత్త పాట పాడుతుంది. అనకాపల్లి ఎంపీ స్థానానికి బదులు విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని, విజయనగరంకు బదులుగా అమలాపురం పార్లమెంటు సీటును బీజేపీ కోరుతుందని టాక్ నడుస్తుంది. అలానే అనపర్తి, పాడేరు, ఆదోని, గుంటూరు పశ్చిమ, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను బీజేపీ కోరుతోందని చెబుతున్నారు. అయితే ఆ సీట్లు చంద్రబాబు తమ పార్టీ అభ్యర్ధులకి కేటాయించగా వాటిని బీజేపీ కోరుతుండడం హాట్ టాపిక్గా మారింది.
బీజేపీ పట్టుబడితే సీట్ల మార్పు తప్పక జరుగుతుందని అంటున్నారు. జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా, ఇందులో ఏడు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆ సీట్లలో కొన్నింటిని బీజేపీ కోరుతుందని టాక్ నడుస్తుంది. వాటి గురించి చర్చించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తదితర నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసి పోటీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సమర్పించారని అదిష్టానం నిర్ణయం తర్వాత మళ్లీ కొత్తగా అభ్యర్ధులని ప్రకటిస్తారని సమాచారం. దీనికి మరింత సమయం పట్టే అవకాశం కూడా ఉందని టాక్. బీజేపీ పోటీ చేసే స్థానాల పేర్లు ఈ గ్యాప్లో ఫిక్స్ చేస్తే ఆ వెంటనే జనసేన, టీడీపీ తాము పోటీ చేసే సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.