Good News : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యువజన పథకం...ఈ-కేవైసీ చేసిన వారికి లబ్ది...!
Good News : కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి ఈ-కేవైసీ చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. అయితే చాలామంది రైతులకు ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో అందరూ దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అయితే వ్యవసాయంలో రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 6000 నేరుగా రైతుల ఖాతాలలోకి మూడు విడతలుగా వచ్చి చేరుతాయి. అయితే ఈ పథకం పై పూర్తి అవగాహన లేకపోవడం అలాగే చాలామంది రైతులు రెండు మూడు ఆధార్ కార్డులకు ఒకటే నెంబర్ ఇవ్వడం అలాగే ఆ నెంబర్లు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడం ,అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానం అయి లేకపోవడం వంటి కారణాల వలన రైతులకు ఈ పథకం ద్వారా డబ్బు అందడం లేదు. అందుకే రైతులు ఈ-కేవైసీ చేపిస్తే భవిష్యత్తులో వారికి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతి జిల్లాలో 67,995 మంది రైతుల్లో కేవలం 63,365 మంది రైతులు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. అంటే ఇంకా 4,630 మంది రైతులు ఈ-కేవైసీ చేయించుకోవలసి ఉంటుంది. అలాగే 2,149 మంది రైతులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అను సంధానం చేసుకోవాల్సి ఉంది.
2019 ఫిబ్రవరి 1 లోపు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు అవుతారు.. అలాంటివార మీసేవ కేంద్రాలు లేదా నేరుగా సెల్ ఫోన్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు. అదేవిధంగా రైతుల బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతా తో పాటు పనిచేసే ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు ఈ-కేవైసీ చేసిన తర్వాత కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అందుకోలేకపోతే రైతు బ్యాంకు ను కూడా ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకానికి ఈ-కేవైసీ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింకు కింద ఇవ్వడం జరిగింది గమనించగలరు. https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పొందడానికి రైతులు కచ్చితంగా ఈ-కేవైసి చేసుకోవాలి. అయితే జిల్లాలో ఇప్పటికీ 463 మంది రైతులు ఈ-కేవైసి పెండింగ్ లో ఉంది. కాబట్టి అర్హులైన రైతులు వెంటనే ఈ-కేవైసి చేయించుకుని ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
This website uses cookies.