
Good News : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యువజన పథకం...ఈ-కేవైసీ చేసిన వారికి లబ్ది...!
Good News : కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి ఈ-కేవైసీ చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. అయితే చాలామంది రైతులకు ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో అందరూ దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అయితే వ్యవసాయంలో రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 6000 నేరుగా రైతుల ఖాతాలలోకి మూడు విడతలుగా వచ్చి చేరుతాయి. అయితే ఈ పథకం పై పూర్తి అవగాహన లేకపోవడం అలాగే చాలామంది రైతులు రెండు మూడు ఆధార్ కార్డులకు ఒకటే నెంబర్ ఇవ్వడం అలాగే ఆ నెంబర్లు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడం ,అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానం అయి లేకపోవడం వంటి కారణాల వలన రైతులకు ఈ పథకం ద్వారా డబ్బు అందడం లేదు. అందుకే రైతులు ఈ-కేవైసీ చేపిస్తే భవిష్యత్తులో వారికి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతి జిల్లాలో 67,995 మంది రైతుల్లో కేవలం 63,365 మంది రైతులు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. అంటే ఇంకా 4,630 మంది రైతులు ఈ-కేవైసీ చేయించుకోవలసి ఉంటుంది. అలాగే 2,149 మంది రైతులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అను సంధానం చేసుకోవాల్సి ఉంది.
2019 ఫిబ్రవరి 1 లోపు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు అవుతారు.. అలాంటివార మీసేవ కేంద్రాలు లేదా నేరుగా సెల్ ఫోన్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు. అదేవిధంగా రైతుల బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతా తో పాటు పనిచేసే ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు ఈ-కేవైసీ చేసిన తర్వాత కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అందుకోలేకపోతే రైతు బ్యాంకు ను కూడా ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకానికి ఈ-కేవైసీ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింకు కింద ఇవ్వడం జరిగింది గమనించగలరు. https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పొందడానికి రైతులు కచ్చితంగా ఈ-కేవైసి చేసుకోవాలి. అయితే జిల్లాలో ఇప్పటికీ 463 మంది రైతులు ఈ-కేవైసి పెండింగ్ లో ఉంది. కాబట్టి అర్హులైన రైతులు వెంటనే ఈ-కేవైసి చేయించుకుని ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.