Roja VS Balakrishna : బాలయ్య కూడా జైలుకు పోతే మళ్లీ డ్యాన్స్ చేస్తా.. ఒసేయ్ రోజా విశ్వాసం లేని పిచ్చి కుక్క
Roja VS Balakrishna : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. చంద్రబాబు అరెస్ట్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు అయితే చంద్రబాబు అరెస్ట్ కావడంతో పండుగ చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు రోడ్లు మీదికి వచ్చి మరీ నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసింది ఈ ఒక్క తప్పే కాదు. ఇదొక్కటే కాదు.. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయి. అవన్నీ విచారణ జరిగి నేరం రుజువు అయితే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉండాలి. బయటికి కూడా రాడు అంటూ రోజా కామెంట్ చేశారు.ఇది నేను ఎప్పుడో చెప్పాను. ఒక్కసారి చంద్రబాబు బోను ఎక్కి కేసు విచారణకు సిద్ధం అయితే ఇక ఆయన బయటికి రావడం కష్టం అని చెప్పాను. చంద్రబాబుకు జైలులో చాలా సెక్యూరిటీ ఇచ్చారు.
ఆయన ప్రాణాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు. ఆయన ఎవరినైనా చంపుతారు అంటే భయపడాలి కానీ.. ఆయన్ను ఎవ్వరూ చంపరు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడిని అడ్డంగా మోసం చేశారు. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నరోజు. రాజకీయంగా ఆయన ఎంతమందిని పైకి పంపించారు.. ఎంతమందిని జైలుకు పంపించారు. ఎంతమందిని క్యారెక్టర్ లేని వారిగా ముద్ర వేయించారో అందరికీ తెలుసు. చంద్రబాబు ఏం చేస్తాడో అది తమకు చేస్తారు అన్నట్టుగా పార్టీ వాళ్లు మాట్లాడుతారు. పాపి చిరాయువు. చంద్రబాబు చేసిన పాపాలకు ఆయన మొత్తం అనుభవించాలి. ఆయన చేసిన తప్పులు, పాపాలు అన్ని కూడా జైలులో కూర్చొని పచ్చాత్తాప పడే రోజులు ఇవి అంటూ రోజా చెప్పుకొచ్చారు.
balakrishna reacts on rk roja comments over chandrababu arrest
Roja VS Balakrishna : 2009 లో జూనియర్ ఎన్టీఆర్ ను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు
2009 ఎన్నికల్లో చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ ను ఎలా వాడుకున్నాడో అందరికీ తెలుసు. ఆయనకు యాక్సిడెంట్ అయి చావు బతుకుల నుంచి బయటికి వచ్చాడు. ఆయన్ను ఎలా వాడుకొని చంద్రబాబు తన కొడుకు లోకేష్ కోసం పార్టీ నుంచి గెంటేశాడో అందరికీ తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అంటూ రోజా సీరియస్ అయ్యారు. అయితే.. రోజా వ్యాఖ్యలపై బాలకృష్ణ కూడా స్పందించారు. పిచ్చి కుక్కలు మొరుగుతుంటే మనం పట్టించుకోవాలా? మన విధానం, ఇచ్చిన హక్కు.. మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతే కానీ.. పిచ్చి కుక్కలు మొరుగుతుంటే వాటికి భయపడి చేతులు ముడుచుకొని కూర్చొంటే మన రాష్ట్రాన్ని నడిరోడ్డు మీద అమ్మేస్తారు అంటూ బాలకృష్ణ సీరియస్ అయ్యారు.
