Butchaiah Chowdary : పరాకాష్ఠకు చేరిన జగన్ పిచ్చి : బుచ్చయ్యచౌదరి
Butchaiah Chowdary : వైఎస్ జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేషన్ బియ్యం పంపిణీపై బుచ్చయ్య చౌదరి సభలో మాట్లాడారు. వైఎస్ జగన్ పాలనలో ఇంటింటికి బియ్యం సరఫరా చేస్తామన్నారు. అందుకు రూ.1600 కోట్లు ఖర్చు పెట్టి అయ్యగారి సుందర ముఖారవిందం బొమ్మలు వేశారే తప్పా ఒరిగిందేమి లేదన్నారు. పిచ్చి పరాకాష్ఠకు చేరి గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాకం ఏంటంటే.. చివరికి చిన్న పిల్లలు క్రికెట్ ఆడేప్పుడు పెట్టుకునే గార్డ్ లకు కూడా ఆయన బొమ్మలు వేసుకోవడమే అన్నారు.
Butchaiah Chowdary : పరాకాష్ఠకు చేరిన జగన్ పిచ్చి : బుచ్చయ్యచౌదరి
కేవలం ఆయన ప్రచార ఆర్భారం కోసం ఇంటింటికి, ఇంటింటికి బియ్యం అందజేత అన్నారు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఏదో ఒక రోజు వెళ్లి బియ్యం తెచ్చుకునేవారు. పొలం పనికి వెళ్లేటప్పుడే, ఇతర వృత్తులకు వెళ్లేటప్పుడే, వాళ్లకు అనుకూల సమయం చూసి వెళ్లి బియ్యం తెచ్చుకునేవాళ్లు అని తెలిపారు. ఇవాళ వాహనాలు అన్నారు. ఆ వాహనాలు నడవడం లేదు. ఇంటింటికి ఇవ్వడం లేదు. కేవలం ఒక సెంటర్లో పెడుతున్నారు. పర్యవసానంగా ఏమైతుంది, కేంద్రీకృతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దోపిడికి పాల్పడినట్లు ఆయన దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధంతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ 24వ వార్షిక నివేదిక ప్రతి, 2020-2021 సంవత్సరానికి ఏపీ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ 52వ వార్షిక నివేదిక ప్రతిని సంబంధిత మంత్రులు సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
This website uses cookies.