Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ప్ర‌త్యేక ఛాంబ‌ర్.. ఎప్పుడు బాధ్య‌త‌లు అందుకోనున్నారు అంటే..!

Advertisement
Advertisement

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి.. యాక్షన్‌లోకి దిగారు. పోలవరం పర్యటనకు కూడా వెళ్లారు. ఇక పలువురు మంత్రులు కూడా తమ‌కు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలు స్వీకరించి.. సంబంధిత శాఖపై పట్టు పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయిన నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. రీసెంట్‌గా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ కోసం.. చంద్రబాబు దగ్గరలోనే కొత్త ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

Pawan Kalyan ముహూర్తం ఫిక్స్..

కాని సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం రెడీ చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూరుస్తున్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.

Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ప్ర‌త్యేక ఛాంబ‌ర్.. ఎప్పుడు బాధ్య‌త‌లు అందుకోనున్నారు అంటే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈనెల 12న పవన్‌ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన అభిష్టం మేరకు శాఖలు కేటాయించారు. ఇప్పటికే తెలుగుదేశం, బీజేపీకి చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించగా, మంచి ముహూర్తం చూసుకొని, ఆయా మంత్రులు తమకు కేటాయించిన ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. అధికారం చేపట్టిన అనంతరం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Recent Posts

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

35 minutes ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

2 hours ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

3 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

4 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

5 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

6 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

7 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

15 hours ago