cbn vizag
CBN : వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెందుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన… విశాఖకు పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన విజయం అందించాలని కోరారు. తెలుగుదేశంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
CBN
విశాఖలో దందాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.జగన్ ఏబీసీడీ పాలసీ పెట్టారని విమర్శించారు. ఏ అంటే ఎవరిపైన అయినా దాడులు చేస్తారని దుయ్యబట్టారు.
‘హుద్హుద్ తుపాను వచ్చినప్పుడు ఇక్కడే 10 రోజులున్నా… విశాఖలో పరిస్థితి సాధారణం అయ్యాకే తిరిగివెళ్లా. ఏ ఒక్క అవకాశం వచ్చినా విశాఖకు తీసుకువచ్చా. లూలూ సంస్థ వస్తే పర్యాటకం అభివృద్ధి చెందాలనుకున్నా. విశాఖకు గతంలో ఉన్న శోభ ఇప్పుడు ఉందా? అదానీ, లూలూ సంస్థలు పారిపోయంటూ విమర్శలు చేశాడు.
జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును చంద్రబాబు ప్రకటించారు. పీలా శ్రీనివాస్ను గెలిపిస్తే ఇంటి పన్ను పెరగదని స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన విజయం అందించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. నీతి, నిజాయితీకి విశాఖ మారుపేరు అని కొనియాడారు. హుద్హుద్ తుపాను ధాటికి విశాఖ పెద్దఎత్తున దెబ్బతిందన్న ఆయన.. ఆనాడు విశాఖ తిరిగి కోలుకుంటుందో? లేదో? తెలియని పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.
తుపాను వచ్చిన తర్వాత రోజే ప్రధాని విశాఖ వచ్చారని… ప్రధానితో కలిసి తాను కారులో వస్తుంటే ప్రజలు నవ్వుతూ స్వాగతం పలికారని చెప్పారు. నాడు విశాఖ ప్రజల స్వాగతం చూసి ప్రధాని ఆశ్చర్యపోయారన్నారు. విశాఖను ప్రపంచ పటంలో పెట్టామని.. నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశామని వెల్లడించారు. విశాఖను అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం తెదేపాకే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇక మరోపక్క విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవటానికి వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి విశాఖ లో విజయం సాధించటం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఆంధ్రుల రాజధాని అనే ముద్ర పడిన విశాఖ లో మేయర్ పీఠం కు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. అందుకే ఇరు పార్టీలు విజయం కోసం పోరాటం చేస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే వైసీపీ కి ఇక్కడే ఎడ్జ్ కనిపిస్తుంది. టీడీపీ కి చెందిన కీలక నేతలు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పైగా విశాఖను రాజధానిని చేసిన ఘనత కూడా వైసీపీ ఖాతాలో ఉంది కాబట్టి, వైసీప కి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.