Chandrababu : చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్.. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం పచ్చజెండా..!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతం అయింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఈ నెల 16న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు, రోడ్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, ఏపీకి రావాల్సిన నిధులను కోరడం వంటి కీలక అంశాలు చర్చించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ ప్రధాని మోదీతో సమావేశమై రెండు గంటలపాటు చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు అలా ఢిల్లీ టూర్ ముగించుకుని ఏపీకి తిరిగి వచ్చారో కేంద్రం ఏపీకి శుభవార్త అందించింది. దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వే జోన్ కలను సాకారం చేసేలా ఆ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పచ్చ జెండా ఊపేశారు. రైల్వే జోన్ కి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని అతి తొందరలోనే విశాఖలో రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు భూ కేటాయింపులు, ఇతర అంశాల మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందని తెలిపారు.
Chandrababu : చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్.. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం పచ్చజెండా..!
విశాఖ రైల్వే జోన్ 1970 ప్రాంతంలో ఆనాటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాధం తొలుత ఈ డిమాండ్ చేశారు. నాటి నుంచి ఈ డిమాండ్ పెరుగుతూ పోతుంది. 1990 దశకం తర్వాత కేంద్రం దేశంలో అనేక రైల్వే జోన్లను మంజూరు చేసినపుడు విశాఖ రైల్వే జోన్ ఆశలు చిగురించాయి. అయితే రైల్వే జోన్ కోసం సాగిన పోరాటాలపై కేంద్రం స్పందించలేదు.2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం, విభజన హామీల్లో రైల్వే జోన్ ఉండడంతో ఇక జోన్ ఏర్పాటు ఖాయమని అంతా భావించారు. అనుకున్నట్టుగానే 2019లో కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే గడచిన అయిదేళ్ల కాలంలో అడుగు ముందుకు పడలేదు. తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కలను సాకరం చేస్తూ కేంద్రం ఏపీకి శుభవార్త అందించింది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.