Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతం అయింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఈ నెల 16న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు, రోడ్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, ఏపీకి రావాల్సిన నిధులను కోరడం వంటి కీలక అంశాలు చర్చించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ ప్రధాని మోదీతో సమావేశమై రెండు గంటలపాటు చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు అలా ఢిల్లీ టూర్ ముగించుకుని ఏపీకి తిరిగి వచ్చారో కేంద్రం ఏపీకి శుభవార్త అందించింది. దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వే జోన్ కలను సాకారం చేసేలా ఆ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పచ్చ జెండా ఊపేశారు. రైల్వే జోన్ కి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని అతి తొందరలోనే విశాఖలో రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు భూ కేటాయింపులు, ఇతర అంశాల మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందని తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ 1970 ప్రాంతంలో ఆనాటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాధం తొలుత ఈ డిమాండ్ చేశారు. నాటి నుంచి ఈ డిమాండ్ పెరుగుతూ పోతుంది. 1990 దశకం తర్వాత కేంద్రం దేశంలో అనేక రైల్వే జోన్లను మంజూరు చేసినపుడు విశాఖ రైల్వే జోన్ ఆశలు చిగురించాయి. అయితే రైల్వే జోన్ కోసం సాగిన పోరాటాలపై కేంద్రం స్పందించలేదు.2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం, విభజన హామీల్లో రైల్వే జోన్ ఉండడంతో ఇక జోన్ ఏర్పాటు ఖాయమని అంతా భావించారు. అనుకున్నట్టుగానే 2019లో కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే గడచిన అయిదేళ్ల కాలంలో అడుగు ముందుకు పడలేదు. తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కలను సాకరం చేస్తూ కేంద్రం ఏపీకి శుభవార్త అందించింది.
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కూడా రాశులకి అశుభ ఫలితాలు ఇస్తాయి. అయితే ఈసారి…
Liver : మన శరీరంలో కాలేయం అనేది ఒక ముఖ్యమైన భాగం. ఇది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర…
RRC NCR : రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్రాజ్, అప్రెంటీస్ల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది.…
Married Couples : నేటి కాలంలో వైవాహిత జీవితం సజావుగా సాగాలంటే నమ్మకం మరియు సమన్వయం తప్పకుండా ఉండాలి. ఒకవేళ…
Green Tea : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. అందుకే బరువు తగ్గడానికి మరియు…
ECGC Recruitment 2024 : ECGC లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కోసం ఆసక్తి గల…
This website uses cookies.