Special Status : ప్రత్యేక హోదా రచ్చ.. బీహార్కి నో చెప్పిన కేంద్రం.. చంద్రబాబు సాధిస్తాడా..!
Special Status : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ రాజకీయ మంటలు రగులుతున్నాయి. ఢిల్లీ వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య స్పెషల్ స్టేటస్ ఫైట్ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ.. ప్రత్యేక హోదాపై మాట్లడడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే.. తమ ముందు చాలా అంశాలు ఉన్నాయని.. వాటన్నింటిపైనా పార్లమెంట్లో మాట్లాడతామంటూ టీడీపీ కౌంటర్ ఇవ్వడం కాకరేపుతోంది. తాజాగా పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.
పార్లమెంట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రణాళిక సహాయం కోసం.. గతంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ -ఎన్డీసీ ద్వారా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు చేశారు. ప్రత్యేక కేటగిరీ ప్రకటించేందుకు అనేక కారణాలు, అవసరాల ఆధారంగా వర్గీకరించారు. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. బీహార్ రాష్ట్ర పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎన్డీఏలో చక్రం తిప్పవచ్చని.. తమ డిమాండ్లు కేంద్రం వద్ద నుంచి సాధించవచ్చని ఇన్ని రోజులు భావించిన నితీష్ కుమార్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కేంద్ర ప్రభుత్వం.. బీహార్కు ప్రత్యేక హోదా లేదని తేల్చేయడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బిహార్ మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ కూడా ప్రత్యేక హోదాను కోరుకుంటోంది.
Special Status : ప్రత్యేక హోదా రచ్చ.. బీహార్కి నో చెప్పిన కేంద్రం.. చంద్రబాబు సాధిస్తాడా..!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ గతంలో పోటాపోటీ హామీలిచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాయి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రత్యేక హోదా సాధన హమీ ఇవ్వకున్నా టిడిపి అత్యధిక ఎంపీలను గెలవడం… కేంద్ర ప్రభుత్వమే ఈ పార్టీపై ఆధారపడటంతో ప్రత్యేక హోదాపై ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆశలను మోదీ సర్కార్ ఆదిలోనే తుంచేసింది. సేమ్ టిడిపి లాగే ఎన్డిఏలో జేడియూ కూడా కీలక భాగస్వామి… కాబట్టి ఆ రాష్ట్రానికి నో చెప్పారు కాబట్టి ఏపికి కూడా నో చెప్పినట్లే. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఈ ప్రస్తావనే తీసుకురాలేదు. ఇక ఎన్నికల్లో విజయం తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. కేంద్ర నుండి నిధులు తీసుకువస్తామని, పోలవరం నిర్మాణానికి సహాయం వంటి విషయాల గురించి మాట్లాడారు కానీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు. దీన్నిబట్టే ఆయన ప్రత్యేక హోదా అసాధ్యమని ముందే గ్రహించినట్లు అర్థమవుతోంది.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.