Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?
ప్రధానాంశాలు:
Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల నుంచి తమ ప్రతినిధులపై ఎలా స్పందన ఉందో తెలుసుకునే క్రమంలో పార్టీ అధిష్టానం ఐవీఆర్ఎస్ (IVRS) కాల్స్ ద్వారా సమీక్ష ప్రారంభించింది. ముందుగా రాయలసీమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని వారి పనితీరు పట్ల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?
Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం
“మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా ..లేదా ?” అనే ప్రశ్నలతో ప్రజలతో కాల్స్ ద్వారా పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను నమోదు చేస్తూ, ప్రతి ఎమ్మెల్యే పట్ల వారి సంతృప్తి లేదా అసంతృప్తిని అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండే నేతల్ని గుర్తించి, జనం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకునే అవకాశముంది.
ఇటీవల (KK) సర్వే ఫలితాల్లో 33 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఆగ్రహం ఉందని వెల్లడైన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పార్టీకి బలహీనంగా మారుతున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తూ, తగిన మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు తొలి అడుగుగా IVRS కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుండటం విశేషం. దీనిని బట్టి త్వరలోనే టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై కీలక నిర్ణయాలు వెలువడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.