Chandrababu : మహిళలకి శుభవార్త అందించిన చంద్రబాబు..!
ప్రధానాంశాలు:
Chandrababu : మహిళలకి శుభవార్త అందించిన చంద్రబాబు..!
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాష్ట్ర మహిళలకు Womens ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Nara Chandrababu Naidu శుభవార్త అందించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రానుందని ప్రకటించారు. మంగళవారం శ్రీశైలంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ పథకానికి సంబంధించి పూర్తి స్పష్టతను ఆయన ఇచ్చారు.

Chandrababu : మహిళలకి శుభవార్త అందించిన చంద్రబాబు..!
Chandrababu : శుభవార్త..
ప్రతి జిల్లాకు చెందిన మహిళలు, తమ జిల్లాలోని ఏ ప్రాంతానికి అయినా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఇది ఇంటర్డిస్ట్రిక్ట్ ట్రావెల్కు కాకుండా, ఇంట్రా-డిస్ట్రిక్ట్ ప్రయాణాలకే వర్తించనుంది. ప్రయాణానికి ఒక్క రూపాయైనా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. ఈ పథకం, ఎన్డీఏ కూటమి (టీడీపీ – బీజేపీ – జనసేన) ఎన్నికల హామీల్లో భాగమైన ‘సూపర్ సిక్స్’ ప్రామిస్లో ఒకటి. అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో కార్యాచరణకు దిగింది.
ఈ సందర్భంగా కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై అధ్యయనం చేసి, అధికారుల బృందం వివరాలను సేకరించిందని సమాచారం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈ పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రయాణ సౌకర్యం, బస్సుల లభ్యత, సాంకేతిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఈ పథకం ప్రారంభమైతే, విద్యార్థినులు, కార్మిక మహిళలు, చిన్న వ్యాపారుల జీవితాలకి ఎంతో ఉపయోగపడుతుంది.