Categories: andhra pradeshNews

Chandrababu : నిద్ర‌పోని చంద్ర‌బాబు.. నేనున్నానంటు వ‌ర‌ద బాధితులకు భ‌రోసా..!

Advertisement
Advertisement

Chandrababu : తెలంగాణ‌, ఏపీల‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కి ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నీటమునిగింది. సింగ్‌నగర్‌లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సింగ్‌నగర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.

Advertisement

Chandrababu రివ్యూల‌తో బిజీ బిజీ..

చిమ్మచీకట్లో అరగంటకుపైగా బోటులో పర్యటించారు. సెల్‌ఫోన్లు, వీడియో కెమెరా లైట్ల వెలుతురులో ఆ ప్రాంతంలో తిరిగారు. బాధితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. వరద తీవ్రతను స్వయంగా తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస చేశారు. తన బస్సును అక్కడే పార్క్ చేశారు. అక్కడే అధికారులతో సమీక్ష చేపట్టారు. వరద తీవ్రత తగ్గేంత వరకూ ఇక్కడే ఉంటానంటూ భరోసా ఇచ్చారు. సహాయక, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు.

Advertisement

Chandrababu : నిద్ర‌పోని చంద్ర‌బాబు.. నేనున్నానంటు వ‌ర‌ద బాధితులకు భ‌రోసా..!

ఆదివారం అంతా విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. తెల్లారుజామున రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. మళ్లీ యథావిధిగా రంగంలోకి దిగిన ఆయన వరద సహాయక చర్యలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఓ వైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు పవర్ బోట్స్ రావడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచి కూడా అధికారులను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో తాగడానికి నీరు, తినడానికి తిండి లేక వరద బాధితులు అల్లాడుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు ఇదివరకే ఆ ప్రాంతంలో పర్యటించినా సరే సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిపోయిన సీబీఎన్.. అధికారులను పరుగులు పెట్టించారు. బాబు రాకతో ఎక్కడికక్కడ అలర్ట్ అయిన ఆఫీసర్లు.. బాధితులకు ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్న పరిస్థితి.

Advertisement

Recent Posts

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

55 minutes ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

5 hours ago

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…

6 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన ఓటర్లు

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…

6 hours ago

TG Municipal Results : మున్సిపల్ ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసిన ఓడిన అభ్యర్థి..ఏ పార్టీ అభ్యర్దో తెలుసా ?

TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…

7 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.70వేలు ఇచ్చాడు..మరి గెలిచాడా ?

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన…

8 hours ago