Categories: andhra pradeshNews

Chandrababu : నిద్ర‌పోని చంద్ర‌బాబు.. నేనున్నానంటు వ‌ర‌ద బాధితులకు భ‌రోసా..!

Chandrababu : తెలంగాణ‌, ఏపీల‌లో కురిసిన భారీ వ‌ర్షాల‌కి ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నీటమునిగింది. సింగ్‌నగర్‌లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సింగ్‌నగర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.

Chandrababu రివ్యూల‌తో బిజీ బిజీ..

చిమ్మచీకట్లో అరగంటకుపైగా బోటులో పర్యటించారు. సెల్‌ఫోన్లు, వీడియో కెమెరా లైట్ల వెలుతురులో ఆ ప్రాంతంలో తిరిగారు. బాధితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. వరద తీవ్రతను స్వయంగా తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస చేశారు. తన బస్సును అక్కడే పార్క్ చేశారు. అక్కడే అధికారులతో సమీక్ష చేపట్టారు. వరద తీవ్రత తగ్గేంత వరకూ ఇక్కడే ఉంటానంటూ భరోసా ఇచ్చారు. సహాయక, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు.

Chandrababu : నిద్ర‌పోని చంద్ర‌బాబు.. నేనున్నానంటు వ‌ర‌ద బాధితులకు భ‌రోసా..!

ఆదివారం అంతా విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. తెల్లారుజామున రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. మళ్లీ యథావిధిగా రంగంలోకి దిగిన ఆయన వరద సహాయక చర్యలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఓ వైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు పవర్ బోట్స్ రావడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచి కూడా అధికారులను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో తాగడానికి నీరు, తినడానికి తిండి లేక వరద బాధితులు అల్లాడుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు ఇదివరకే ఆ ప్రాంతంలో పర్యటించినా సరే సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిపోయిన సీబీఎన్.. అధికారులను పరుగులు పెట్టించారు. బాబు రాకతో ఎక్కడికక్కడ అలర్ట్ అయిన ఆఫీసర్లు.. బాధితులకు ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్న పరిస్థితి.

Recent Posts

Garlic | చలికాలంలో ఆరోగ్యానికి అద్భుత ఔషధం వెల్లుల్లి.. ఎన్ని ఉప‌యోగాలున్నాయో తెలుసా?

Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…

10 minutes ago

Devotional | వృశ్చికరాశిలో బుధుడు–కుజుడు యోగం .. నాలుగు రాశుల జీవితంలో స్వర్ణయుగం ప్రారంభం!

Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…

2 hours ago

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

15 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

17 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

19 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

20 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

23 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

1 day ago