Chandrababu : ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు… ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు… ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే..!

Chandrababu : ఏపీలో వ‌ర‌ద ప్ర‌వాహం ఎంతటి ఉత్ప‌న్నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.అసాధారణ వర్షాలకు బుడమేరుకి గండ్లు పడి విజయవాడ నగరంలోని అనేక కాలనీలను ముంచెత్తింది. లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.ఈ స‌మయంలో చంద్ర‌బాబు తాము అంద‌రికి అండ‌గా ఉంటామని ప్ర‌జ‌ల‌లో ధైర్యం నింపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే కలెక్టరేట్‌లో మకాం వేశారు చంద్రబాబు. వరద సహాయక చర్యలను అక్కడి నుంచే పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో అమలునూ స్వయంగా ఏరోజుకారోజు స్వయంగా పరిశీలించారు. వరదల్లో రాకపోకలు ఇబ్బందికరమైనా […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు... ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే..!

Chandrababu : ఏపీలో వ‌ర‌ద ప్ర‌వాహం ఎంతటి ఉత్ప‌న్నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.అసాధారణ వర్షాలకు బుడమేరుకి గండ్లు పడి విజయవాడ నగరంలోని అనేక కాలనీలను ముంచెత్తింది. లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.ఈ స‌మయంలో చంద్ర‌బాబు తాము అంద‌రికి అండ‌గా ఉంటామని ప్ర‌జ‌ల‌లో ధైర్యం నింపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచే కలెక్టరేట్‌లో మకాం వేశారు చంద్రబాబు. వరద సహాయక చర్యలను అక్కడి నుంచే పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో అమలునూ స్వయంగా ఏరోజుకారోజు స్వయంగా పరిశీలించారు. వరదల్లో రాకపోకలు ఇబ్బందికరమైనా ఆయన వెనక్కి తగ్గలేదు.

Chandrababu ద‌టీజ్ బాబు…

బోట్లపైనే బాధిత ప్రాంతాలకు వెళ్లారు. మొదటి రోజు రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు. వరద కొంచెం తగ్గాక కార్లు తిరిగే పరిస్థితి లేకపోతే ప్రొక్లైన్‌పైనే ముంపు ప్రాంతాల్ని చుట్టేశారు. 74 ఏళ్ల వయసులోనూ రోజూ ఐదారు గంటల పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సత్వరసాయం అందేలా చేశారు. మోకాళ్లలోతు నీటిలోనూ తిరిగారు. కష్టమొస్తే ప్రభుత్వంపై అసహనం, కోపం, నిరుత్సాహంతో విరుచుకుపడే బాధితుల ఆక్రోశాన్నీ అర్ధం చేసుకుని, రోజులు గడిచేకొద్దీ వారితోనే శెభాష్ అనిపించుకున్నారు.ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాధితులకు అండగా ఉంటూ.. భరోసా కల్పించారు. అర్దరాత్రి సైతం బాధి తుల వద్దకు వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు.

Chandrababu ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే

Chandrababu : ఎట్ట‌కేల‌కి బ‌స్సు వీడి ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు… ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌ల‌తోనే..!

ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలియజేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ఉంచారు. వరద నుంచి విజయవాడ పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉంటానని మాట ఇచ్చిన చంద్రబాబు పదిరోజులు అక్కడే ఉండి.. పరిస్థితి కుదుటపడటంతో మంగళవారం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్ళారు. అప్పటిదాకా పండగైనా, పబ్బమైనా ప్రజలతోనే.!చివరకు వినాయకచవితినీ ప్రజల మధ్యే జరుపుకున్నారు. పది రోజుల తర్వాత ఇల్లు చేరారు.ముంపు ప్రాంతాల్లో చివరి వ్యక్తికీ ప్రభుత్వ సహాయం అందాలన్నది చంద్రబాబు అభిమతం. దాని కోసం ఆయన మంత్రులు, యంత్రాంగాన్ని మోహరించారు. ఐఎఎస్, ఐపీఎస్​లనూ కార్యాలయాల నుంచి కార్యక్షేత్రంలోకి పంపారు. 32 వరద పీడిత డివిజన్లకు ఒక్కో సీనియర్‌ ఐఏఎస్‌ చొప్పున నియమించారు. 179 సచివాలయాలకు 179 మంది ఇంఛార్జుల్ని పెట్టారు. వరద వీడుతున్న ఒక్కో ప్రాంతాన్ని సాధారణ స్థితికి తెస్తూ వచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది