
Chandrababu : చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలు... పవన్ కు చెప్పకుండానే అభ్యర్థుల ప్రకటన....!
Chandrababu : ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ 68 చోట్ల సిట్టింగ్ లను మార్చడం జరిగింది. ఇక అదే సమయంలో టిడిపి మరియు జనసేన మధ్య సీట్లు సర్దుబాటు ,అలాగే బిజెపి కూటమిలోకి చేరడం వంటివి సరిగ్గా జరగడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల ఆఖరిలోపు బిజెపి నుంచి కూడా స్పష్టత లభించనుంది.ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్రమంతా ” రా కదలిరా ” అనే నినాదంతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గం లో అసెంబ్లీ స్థానంలో ఈ బహిరంగ సభలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం సభలు పూర్తికాగా అభ్యర్థులు ఖరారు అయినచోట ఈ సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సభలకు హాజరవుతున్న చంద్రబాబు వేదికపై నుంచి టిడిపి అభ్యర్థుల విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేస్తారని బహిరంగంగా సంకేతాలు కూడా పంపుతున్నారు.
అయితే జనసేన సీట్లతో సర్దుబాటు రాకముందే చంద్రబాబు ఇలా ప్రకటనలు చేయడం పై అభ్యంతరాల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయని చెప్పాలి. అయితే తాజాగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట అభ్యర్థిగా వేగుళ్ళ జోగేశ్వరరావును చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అంతేకాక వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా వేగేళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఆయనకు టికెట్ ఖరారు చేశారు. ఇక మండపేట నుండి పోటీ చేసేందుకు జనసేన పార్టీ సైతం సిద్ధంగా ఉంది. కానీ అవేవీ పరిగినలోకి తీసుకోకుండా చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన అభ్యర్థుల నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో మండపేట నుండి జనసేన నేత లీల కృష్ణ పోటీ చేయడం జరిగింది.
దాదాపు 35 వేలకు పైగా సీట్లు సాధించి జనసేన పార్టీ అక్కడ బలమైన స్థాయిలో ఉంది. అయితే టిడిపి తో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ సీటును కచ్చితంగా జనసేనకు కేటాయిస్తారని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడికి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా టిడిపి అభ్యర్థిని ప్రకటించడం సమంజసం కాదని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లీలా కృష్ణ కూడా పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఏకపక్ష ప్రకటనలను వారు ఖండించారు. ఇక ఈ విషయంపై హై కమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పుకొచ్చారు. అయితే ఒక మండపేట మాత్రమే కాకుండా చాలా నియోజకవర్గాలలో ఇదే తంతు కనిపిస్తుంది. మరి ఈ సరిచేసుకుని రెండు పార్టీలు ఎలా ముందుకు సాగుతాయో ఎదురుచూడాల్సిందే.
Coffee for Memory : ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ వాసన రాకపోతే చాలామందికి రోజు సరిగా మొదలైనట్టే…
Today Horoscope 13th February 2026 : వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2026 ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు…
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
This website uses cookies.