
Chandrababu : చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలు... పవన్ కు చెప్పకుండానే అభ్యర్థుల ప్రకటన....!
Chandrababu : ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ 68 చోట్ల సిట్టింగ్ లను మార్చడం జరిగింది. ఇక అదే సమయంలో టిడిపి మరియు జనసేన మధ్య సీట్లు సర్దుబాటు ,అలాగే బిజెపి కూటమిలోకి చేరడం వంటివి సరిగ్గా జరగడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల ఆఖరిలోపు బిజెపి నుంచి కూడా స్పష్టత లభించనుంది.ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్రమంతా ” రా కదలిరా ” అనే నినాదంతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గం లో అసెంబ్లీ స్థానంలో ఈ బహిరంగ సభలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం సభలు పూర్తికాగా అభ్యర్థులు ఖరారు అయినచోట ఈ సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సభలకు హాజరవుతున్న చంద్రబాబు వేదికపై నుంచి టిడిపి అభ్యర్థుల విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేస్తారని బహిరంగంగా సంకేతాలు కూడా పంపుతున్నారు.
అయితే జనసేన సీట్లతో సర్దుబాటు రాకముందే చంద్రబాబు ఇలా ప్రకటనలు చేయడం పై అభ్యంతరాల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయని చెప్పాలి. అయితే తాజాగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట అభ్యర్థిగా వేగుళ్ళ జోగేశ్వరరావును చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అంతేకాక వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా వేగేళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఆయనకు టికెట్ ఖరారు చేశారు. ఇక మండపేట నుండి పోటీ చేసేందుకు జనసేన పార్టీ సైతం సిద్ధంగా ఉంది. కానీ అవేవీ పరిగినలోకి తీసుకోకుండా చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన అభ్యర్థుల నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో మండపేట నుండి జనసేన నేత లీల కృష్ణ పోటీ చేయడం జరిగింది.
దాదాపు 35 వేలకు పైగా సీట్లు సాధించి జనసేన పార్టీ అక్కడ బలమైన స్థాయిలో ఉంది. అయితే టిడిపి తో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ సీటును కచ్చితంగా జనసేనకు కేటాయిస్తారని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడికి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా టిడిపి అభ్యర్థిని ప్రకటించడం సమంజసం కాదని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లీలా కృష్ణ కూడా పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఏకపక్ష ప్రకటనలను వారు ఖండించారు. ఇక ఈ విషయంపై హై కమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పుకొచ్చారు. అయితే ఒక మండపేట మాత్రమే కాకుండా చాలా నియోజకవర్గాలలో ఇదే తంతు కనిపిస్తుంది. మరి ఈ సరిచేసుకుని రెండు పార్టీలు ఎలా ముందుకు సాగుతాయో ఎదురుచూడాల్సిందే.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.