Home » Andhra Pradesh » Edx Online Learning Program For Students
andhra pradesh

Edx online Program : విద్యార్థులకు శుభవార్త.. ఉచితంగా ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి..!

Authored By
aruna
The Telugu News | Updated on: February 16, 2024 12:29 pm
Advertisement

Edx online Program : ఏపీ ప్రభుత్వం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టీచింగ్ లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ బోధన విధానాలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా రూపొందించాయి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులో రానున్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే విద్యార్థులు అత్యున్నత కోర్సులు నేర్చుకోవచ్చు. హార్వర్డ్, ఎంఐటి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సులో ఏపీ విద్యార్థులు సర్టిఫికెట్లు ఈజీగా పొందవచ్చు.

Advertisement

తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తుంది. ఈ కోర్సులకు ఫీజులను ప్రభుత్వమే భరించనుంది.ఎడెక్స్ ప్రపంచంలోనే ప్రముఖ ఈ లెర్నింగ్ ప్లాట్ఫారంగా పేరుపొందింది. ఇందులో 150కి పైగా వరల్డ్ క్లాసు వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సులోని రెండువేలపైగా వర్టికల్స్ను చదువుకోవచ్చు. ఒక్కో కోర్సు చేయాలంటే సుమారు 30,000 ఖర్చఅవుతుంద. ఇంత ఖరీదైన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మందికి పైగా విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా అందిస్తుంది. దీనికోసం ఏటా సుమారు 50 కోట్లకు పైగా వెచ్చించనుంది. రాష్ట్రంలోని సాంప్రదాయ వర్సిటీలతోపాటు సాంకేతిక విశ్వవిద్యాలయాలు వ్యవసాయ ఉద్యాన వెటర్నిటీలాలంటి 20 విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులకు ఎడెక్స్ కోర్సులను అందిస్తారు.

ఆయా కళాశాలలో వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సులు తప్పనిసరిగా విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. ఎడెక్స్ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్మెంట్స్ ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తుంది. ఎడెక్స్ రూపొందించిన ప్రశ్న పత్రంతో రాత పరీక్ష వర్సిటీలే నిర్వహిస్తాయి. క్రెడిట్లను కూడా వర్సిటీలై ఇస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేయవచ్చు. వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి