
Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.20,000ల పెట్టుబడి సాయం ఇవ్వనుంది. రైతుల ఖాతాల్లో నేరుగా ఈ నిధులు జమ చేయబడతాయి. విశాఖపట్నం వ్యవసాయ శాఖ అధికారి బి. మోహనరావు తెలిపిన ప్రకారం, ఈ పథకాన్ని పొందాలంటే రైతులు తక్షణమే eKYC ప్రక్రియను పూర్తి చేయాలి. గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ ప్రక్రియను పర్యవేక్షించి, అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.
Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే
ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు, మధ్యస్థ మరియు పెద్ద రైతులు లబ్ధి పొందవచ్చు. గ్రామ స్థాయిలో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతుల సమాచారం తనిఖీ చేయబడుతుంది. మే 20వ తేదీకి ముందు అన్నదాత సుఖీభవ పోర్టల్లో రైతుల వివరాలను అప్లోడ్ చేసి, eKYC పూర్తిచేయాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం తహసీల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక లాగిన్లు ఇచ్చారు. రైతులు తమ వివరాలను సమయానికి సమర్పించి, సబ్సిడీ సాయం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పథకానికి అనుగుణంగా ఒక రైతు కుటుంబం (భర్త, భార్య, పిల్లలు) ఒక్క యూనిట్గా పరిగణించబడుతుంది. ఒకే కుటుంబంలో భూములు ఉన్నవారిలో ఎక్కువ భూమి కలిగి ఉన్న వారి ఖాతాలో నిధులు జమ చేయబడతాయి. మరణించినవారు, ప్రజా ప్రతినిధులు, అధిక పెన్షన్ తీసుకునే వారు, ప్రభుత్వ ఉద్యోగులు (కొందరు మినహాయింపు తో), డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు, ఇతర రాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు కావు. కౌలురైతులకు ప్రత్యేకంగా కార్డు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. అందువల్ల ప్రతి అర్హ రైతు తప్పకుండా eKYC పూర్తిచేయాలని సూచించడమైనది.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.