Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.20,000ల పెట్టుబడి సాయం ఇవ్వనుంది. రైతుల ఖాతాల్లో నేరుగా ఈ నిధులు జమ చేయబడతాయి. విశాఖపట్నం వ్యవసాయ శాఖ అధికారి బి. మోహనరావు తెలిపిన ప్రకారం, ఈ పథకాన్ని పొందాలంటే రైతులు తక్షణమే eKYC ప్రక్రియను పూర్తి చేయాలి. గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ ప్రక్రియను పర్యవేక్షించి, అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.
Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే
ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు, మధ్యస్థ మరియు పెద్ద రైతులు లబ్ధి పొందవచ్చు. గ్రామ స్థాయిలో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతుల సమాచారం తనిఖీ చేయబడుతుంది. మే 20వ తేదీకి ముందు అన్నదాత సుఖీభవ పోర్టల్లో రైతుల వివరాలను అప్లోడ్ చేసి, eKYC పూర్తిచేయాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం తహసీల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక లాగిన్లు ఇచ్చారు. రైతులు తమ వివరాలను సమయానికి సమర్పించి, సబ్సిడీ సాయం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పథకానికి అనుగుణంగా ఒక రైతు కుటుంబం (భర్త, భార్య, పిల్లలు) ఒక్క యూనిట్గా పరిగణించబడుతుంది. ఒకే కుటుంబంలో భూములు ఉన్నవారిలో ఎక్కువ భూమి కలిగి ఉన్న వారి ఖాతాలో నిధులు జమ చేయబడతాయి. మరణించినవారు, ప్రజా ప్రతినిధులు, అధిక పెన్షన్ తీసుకునే వారు, ప్రభుత్వ ఉద్యోగులు (కొందరు మినహాయింపు తో), డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు, ఇతర రాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు కావు. కౌలురైతులకు ప్రత్యేకంగా కార్డు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. అందువల్ల ప్రతి అర్హ రైతు తప్పకుండా eKYC పూర్తిచేయాలని సూచించడమైనది.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.