Vijayashanti : యుద్ధ సమయంలో ఈ రాజకీయాలేంటి విజయశాంతి ..?
Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం “ఆపరేషన్ సింధూర్” పేరిట తీవ్ర దాడులు జరిపింది. ఈ ఆపరేషన్లో పలువురు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఆపరేషన్ విజయంపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. భారత సైన్యం చూపిన శౌర్యాన్ని సమాజం ప్రశంసిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. “భారత్పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ని కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు.
Vijayashanti : యుద్ధ సమయంలో ఈ రాజకీయాలేంటి విజయశాంతి ..?
1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే… ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే… వీరిని స్ఫూర్తిగా తీసుకుని తర్వాతి భారత ప్రభుత్వాలు కూడా నేటికీ భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం.. అయితే కొంతమంది సోషల్ మీడియాల రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రజలెవ్వరమూ రాజకీయo అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలగాలని అభిప్రాయపడుతున్నాను.హరహర మహాదేవ్..జై హింద్ ..జై జవాన్” అంటూ రాసుకొచ్చింది.
విజయశాంతి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నెగటివ్ స్పందనలు వస్తున్నాయి. యుద్ధ సమయంలో రాజకీయ వ్యాఖ్యలు అవసరమా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఉత్కంఠ పరిస్థితుల్లో ఈ తరహా ట్వీట్లు ప్రజలను విభజించే అవకాశం ఉన్నందున వాటిని మానుకోవాలని, కొందరైతే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్పై విమర్శల నేపథ్యంలో విజయశాంతి ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్…
SSC CHSL Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2025…
ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
This website uses cookies.