Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :10 May 2025,6:00 pm

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.20,000ల పెట్టుబడి సాయం ఇవ్వనుంది. రైతుల ఖాతాల్లో నేరుగా ఈ నిధులు జమ చేయబడతాయి. విశాఖపట్నం వ్యవసాయ శాఖ అధికారి బి. మోహనరావు తెలిపిన ప్రకారం, ఈ పథకాన్ని పొందాలంటే రైతులు తక్షణమే eKYC ప్రక్రియను పూర్తి చేయాలి. గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ ప్రక్రియను పర్యవేక్షించి, అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.

Annadata Sukhibhava అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే eKYC చేసుకోవాల్సిందే

Annadata Sukhibhava : ఏపీ రాష్ట్ర రైతులు ఈ పని చేయకపోతే..మీకు డబ్బులు పడనట్లే..!!

ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు, మధ్యస్థ మరియు పెద్ద రైతులు లబ్ధి పొందవచ్చు. గ్రామ స్థాయిలో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతుల సమాచారం తనిఖీ చేయబడుతుంది. మే 20వ తేదీకి ముందు అన్నదాత సుఖీభవ పోర్టల్‌లో రైతుల వివరాలను అప్‌లోడ్ చేసి, eKYC పూర్తిచేయాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం తహసీల్దారులు, మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక లాగిన్లు ఇచ్చారు. రైతులు తమ వివరాలను సమయానికి సమర్పించి, సబ్సిడీ సాయం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

పథకానికి అనుగుణంగా ఒక రైతు కుటుంబం (భర్త, భార్య, పిల్లలు) ఒక్క యూనిట్‌గా పరిగణించబడుతుంది. ఒకే కుటుంబంలో భూములు ఉన్నవారిలో ఎక్కువ భూమి కలిగి ఉన్న వారి ఖాతాలో నిధులు జమ చేయబడతాయి. మరణించినవారు, ప్రజా ప్రతినిధులు, అధిక పెన్షన్ తీసుకునే వారు, ప్రభుత్వ ఉద్యోగులు (కొందరు మినహాయింపు తో), డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు, ఇతర రాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు కావు. కౌలురైతులకు ప్రత్యేకంగా కార్డు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులే. అందువల్ల ప్రతి అర్హ రైతు తప్పకుండా eKYC పూర్తిచేయాలని సూచించడమైనది.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది