YCP : వైసీపీ ఓడితే విశ్వాసం లేనట్లేనా..? మరి గెలిచినప్పుడు సంగతేంటి..?

Advertisement
Advertisement

YCP : సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ పార్టీలు చేసేటువంటి ప్రకటనలు , ప్రవర్తించే తీరు విధానం చూస్తే రాబోయే ఎన్నికల్లో వారి పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ వచ్చింది. అంతేకాక ఎన్నికల్లో చాలా చోట్ల వైసీపీ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపించింది. అనంతరం ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అదే సమయంలో వైసీపీ ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ కూడా ఇదే తరహా ప్రకటనలు చేస్తూ రావడం గమనార్హం. ఎందుకంటే అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు టీడీపీ పార్టీని ఉద్దేశిస్తూ అధిక మొత్తంలో రిగ్గింగ్స్ కు పాల్పడినట్లుగా ఆరోపిస్తోంది. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఎదురైన పరిస్థితులు ఇప్పుడు వైసీపీ పార్టీకి ఎదురుకానున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి పాలవుతుందనే ఆలోచనతోనే వైసీపీ పార్టీ ఈ తరహాలో ఆరోపణలు చేస్తుందని విపక్ష పార్టీలు చెప్పుకొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వైసీపీ పార్టీ తన ఆత్మ రక్షణలో మునిగిపోయిందని చెప్పాలి.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు వరకు సొంత పార్టీ నాయకులను అలాగే అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకునెందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని నమ్మకాన్ని అందరిలో కలిగించేలా చేస్తుందని చెప్పవచ్చు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా వైసీపీ పార్టీ విపరీతమైన ప్రచారాలు కొనసాగిస్తుంది.. దీంతో ఒకవేళ వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆంధ్ర ప్రజలు వైసిపి పార్టీపై విశ్వాసం కోల్పోయారనే ,మ్ప్రచారాలు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే గ్రామస్థాయిలో వాలంటీర్లు అందరూ వాట్సప్ గ్రూపులలో పలు రకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారట. వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను తీసుకునే వారు విశ్వాసం చూపించడానికి ఇదే సరైన సమయం అని , కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీని ఆశీర్వదించి ఓటు వేయాలని కోరుతూ వాట్సాప్ గ్రూప్ లో టాక్ నడిచింది.

Advertisement

ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలు తీసుకున్నవారు కృతజ్ఞతతో ఓటు వేస్తారని కృతజ్ఞత లేని వారు విపక్షాలకు ఓటు వేస్తారంటూ వైసీపీ నేతలు సైతం పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ఈ ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైనట్లయితే ప్రజలకు విశ్వాసం లేదు అన్న మాటను బలంగా వినిపించేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది.తద్వారా కొంతమేరకైనా వైసీపీ పార్టీకి సింపతి దక్కుతుందని ఆలోచనలో ఉంది. అంతేకాక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజల్లో కాస్త వ్యతిరేకత కనిపించింది. అయినప్పటికీ వైసీపీ అధినేత వైయస్ జగన్ మాత్రం గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ చెప్పడం రాజకీయ ఎత్తుగడలలో భాగమేనని పలువురు అంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఓటమిపాలైతే దానికి గల కారణం ప్రజలు అంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో విజయం దక్కించినప్పుడు ప్రజల విశ్వాసం వలన గెలిచామని చెప్పిన వైసీపీ శ్రేణులు ఓటమిపాలైతే మాత్రం విశ్వాసం లేని ప్రజలు అనే మాటను గట్టిగా వినిపించడం అనేది సరైన పద్ధతి కాదంటూ పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.