YCP : వైసీపీ ఓడితే విశ్వాసం లేనట్లేనా..? మరి గెలిచినప్పుడు సంగతేంటి..?

YCP : సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ పార్టీలు చేసేటువంటి ప్రకటనలు , ప్రవర్తించే తీరు విధానం చూస్తే రాబోయే ఎన్నికల్లో వారి పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ వచ్చింది. అంతేకాక ఎన్నికల్లో చాలా చోట్ల వైసీపీ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపించింది. అనంతరం ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అదే సమయంలో వైసీపీ ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీ కూడా ఇదే తరహా ప్రకటనలు చేస్తూ రావడం గమనార్హం. ఎందుకంటే అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు టీడీపీ పార్టీని ఉద్దేశిస్తూ అధిక మొత్తంలో రిగ్గింగ్స్ కు పాల్పడినట్లుగా ఆరోపిస్తోంది. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఎదురైన పరిస్థితులు ఇప్పుడు వైసీపీ పార్టీకి ఎదురుకానున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి పాలవుతుందనే ఆలోచనతోనే వైసీపీ పార్టీ ఈ తరహాలో ఆరోపణలు చేస్తుందని విపక్ష పార్టీలు చెప్పుకొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వైసీపీ పార్టీ తన ఆత్మ రక్షణలో మునిగిపోయిందని చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు వరకు సొంత పార్టీ నాయకులను అలాగే అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకునెందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని నమ్మకాన్ని అందరిలో కలిగించేలా చేస్తుందని చెప్పవచ్చు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా వైసీపీ పార్టీ విపరీతమైన ప్రచారాలు కొనసాగిస్తుంది.. దీంతో ఒకవేళ వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆంధ్ర ప్రజలు వైసిపి పార్టీపై విశ్వాసం కోల్పోయారనే ,మ్ప్రచారాలు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే గ్రామస్థాయిలో వాలంటీర్లు అందరూ వాట్సప్ గ్రూపులలో పలు రకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారట. వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను తీసుకునే వారు విశ్వాసం చూపించడానికి ఇదే సరైన సమయం అని , కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీని ఆశీర్వదించి ఓటు వేయాలని కోరుతూ వాట్సాప్ గ్రూప్ లో టాక్ నడిచింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలు తీసుకున్నవారు కృతజ్ఞతతో ఓటు వేస్తారని కృతజ్ఞత లేని వారు విపక్షాలకు ఓటు వేస్తారంటూ వైసీపీ నేతలు సైతం పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఈ విధంగా చూసుకుంటే ఈ ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైనట్లయితే ప్రజలకు విశ్వాసం లేదు అన్న మాటను బలంగా వినిపించేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది.తద్వారా కొంతమేరకైనా వైసీపీ పార్టీకి సింపతి దక్కుతుందని ఆలోచనలో ఉంది. అంతేకాక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజల్లో కాస్త వ్యతిరేకత కనిపించింది. అయినప్పటికీ వైసీపీ అధినేత వైయస్ జగన్ మాత్రం గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ చెప్పడం రాజకీయ ఎత్తుగడలలో భాగమేనని పలువురు అంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఓటమిపాలైతే దానికి గల కారణం ప్రజలు అంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో విజయం దక్కించినప్పుడు ప్రజల విశ్వాసం వలన గెలిచామని చెప్పిన వైసీపీ శ్రేణులు ఓటమిపాలైతే మాత్రం విశ్వాసం లేని ప్రజలు అనే మాటను గట్టిగా వినిపించడం అనేది సరైన పద్ధతి కాదంటూ పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Recent Posts

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

2 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

3 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

12 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

13 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

14 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

15 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

16 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

17 hours ago