Ysrcp : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దాంతో అన్ని పార్టీలు ఇప్పుడు ఎలాగైనా గెలిచేందుకు చాలా రకాల సన్నాహాలు చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇటు జగన్ ను ఢీ కొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక్కటైపోయాయి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలతో పొత్తులు పెట్టుకుంది. దాంతో ఇప్పుడు పోటీ మరీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి. అన్ని పార్టీలు ప్రచారాలు చేస్తూ దూసుకుపోతున్నాయి. అటు ఇప్పుడు కూటమిలో కొంతమంది అభ్యర్థులపై పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుంది.ఆయా నియోజకవర్గాల్లో ఉండే స్థానిక నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను మార్చుతారని తెలుస్తోంది.
ఇందులో ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి, అనంత జిల్లాలో మార్పులు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే మార్చాలనుకునే నియోజకవర్గాల లిస్టు కూడా రెడీ చేయించారంట. అంతే కాకుండా అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఐవీఆర్ ఎస్ సర్వేలు కూడా చేయిస్తున్నారు. ముందుగా నియోజకవర్గం నేతలతో మాట్లాడిన తర్వాత అభ్యర్థుల మార్పు ఉంటుందని తెలుస్తోంది.
ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట చంద్రబాబు, పవన్ కల్యాణ్. అటు జగన్ ఇప్పటికే అందరు అభ్యర్థులను మార్చేశారు. వైసీపీలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అసంతృప్తులు బయట పడుతున్నాయని తెలుస్తోంది. దాంతో పాటు ఇప్పుడు కూటమి అభ్యర్థులను మారిస్తే కచ్చితంగా జగన్ కూడా కొన్ని చోట్ల మార్పులు చేస్తారని అంటున్నారు. 80 మంది సెట్టింగ్ స్థానాల్లో మార్పులు చేశారు. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులపై ఎప్పటికప్పుడు సర్వేలు బయటకు తీస్తున్నారు. అటు ప్రతిపక్ష కూటమి అభ్యర్థుల బలాబాలపై కూడా ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు స్థానాల్లో మార్పులు ఉంటాయని పార్టీలో చర్చ జరుగుతుంది. ఒక ఎంపీ అభ్యర్థిని సైతం మారుస్తారని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులను మారిస్తే కచ్చితంగా వైసీపీలో మార్పులు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.