
jagan will be the cm again in 2024 says sajjala
Sajjala Ramakrishna Reddy : ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. ఈనేపథ్యంలో వైసీపీలో సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థుల మార్పు ఉంటే ఉండొచ్చు.. ఏది ఏమైనా వైసీపీ చాలా బలంగా ఉంది. మార్పులు జరుగుతున్నాయని కొందరు నేతలు పక్కకు వెళ్తుంటే.. వాళ్లకు ఒక్కసారి నచ్చజెప్పి చేస్తామన్నారు. ఇక్కడ ఇంతకు మించి ఎదుగుదల లేదని వాళ్లు భ్రమ పడితే వాళ్లకు నచ్చజెబుతాం. కానీ.. కొందరు ఇక్కడ ఇమడలేని వాళ్లు ఉంటారు. వాళ్లు ఖచ్చితంగా పోతారు. వాళ్లను ఆపలేం. ప్రస్తుతం మా పార్టీకి డిమాండ్ ఉంది. ఫామ్ లో ఉన్నాం. 2014 ఎన్నికల తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అడ్డంగా కొన్నారు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా పోతే పోనీ కొత్త వారు వస్తారు కదా అనే ఉద్దేశంతోనే జగన్ కూడా చూశారు కానీ.. పోయిన వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
వైసీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పేది ఒక్కటే. పార్టీ నుంచి ఎవరైనా వెళ్తే.. దాన్ని బ్రాడ్ మైండ్ తో చూస్తారు తప్పితే వాళ్లపై సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదు. వారి ప్రయోజనాల కోసం వెళ్తున్నారు. అందులో తప్పేముంది. కొన్ని చోట్ల అసంతృప్తులు వస్తాయి. నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాం. కానీ.. కొందరు నాయకులు ఇక్కడ ఇమడలేనప్పుడు ఖచ్చితంగా వెళ్లిపోతారు. దాంట్లో ఎలాంటి అనుమానం ఉండదు.. అని సజ్జల అన్నారు.
ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నలుగురిని సస్పెండ్ చేశాం. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం. పార్టీ విధానాలు కుదరడం లేదనుకుంటే వాళ్లు వెళ్లిపోతారు. అందులో తప్పేముంది. ఇలాంటి వాళ్ల వల్ల పార్టీకి చాలా నష్టం కలుగుతుంది. అలాంటి వాళ్ల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అని సజ్జల స్పష్టం చేశారు.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.