jagan will be the cm again in 2024 says sajjala
Sajjala Ramakrishna Reddy : ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. ఈనేపథ్యంలో వైసీపీలో సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థుల మార్పు ఉంటే ఉండొచ్చు.. ఏది ఏమైనా వైసీపీ చాలా బలంగా ఉంది. మార్పులు జరుగుతున్నాయని కొందరు నేతలు పక్కకు వెళ్తుంటే.. వాళ్లకు ఒక్కసారి నచ్చజెప్పి చేస్తామన్నారు. ఇక్కడ ఇంతకు మించి ఎదుగుదల లేదని వాళ్లు భ్రమ పడితే వాళ్లకు నచ్చజెబుతాం. కానీ.. కొందరు ఇక్కడ ఇమడలేని వాళ్లు ఉంటారు. వాళ్లు ఖచ్చితంగా పోతారు. వాళ్లను ఆపలేం. ప్రస్తుతం మా పార్టీకి డిమాండ్ ఉంది. ఫామ్ లో ఉన్నాం. 2014 ఎన్నికల తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అడ్డంగా కొన్నారు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా పోతే పోనీ కొత్త వారు వస్తారు కదా అనే ఉద్దేశంతోనే జగన్ కూడా చూశారు కానీ.. పోయిన వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
వైసీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పేది ఒక్కటే. పార్టీ నుంచి ఎవరైనా వెళ్తే.. దాన్ని బ్రాడ్ మైండ్ తో చూస్తారు తప్పితే వాళ్లపై సీఎం జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదు. వారి ప్రయోజనాల కోసం వెళ్తున్నారు. అందులో తప్పేముంది. కొన్ని చోట్ల అసంతృప్తులు వస్తాయి. నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాం. కానీ.. కొందరు నాయకులు ఇక్కడ ఇమడలేనప్పుడు ఖచ్చితంగా వెళ్లిపోతారు. దాంట్లో ఎలాంటి అనుమానం ఉండదు.. అని సజ్జల అన్నారు.
ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నలుగురిని సస్పెండ్ చేశాం. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం. పార్టీ విధానాలు కుదరడం లేదనుకుంటే వాళ్లు వెళ్లిపోతారు. అందులో తప్పేముంది. ఇలాంటి వాళ్ల వల్ల పార్టీకి చాలా నష్టం కలుగుతుంది. అలాంటి వాళ్ల మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అని సజ్జల స్పష్టం చేశారు.
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక యాంకర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నటిగా మారింది. ఒక మనస్సు,…
Air India Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం…
CM Revanth Reddy : హైదరాబాద్ Hyderabad నగరంలో మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ…
Air India Flight : థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి (AI-379) శుక్రవారం బాంబు…
Bhagwat Geeta : తాజాగా జరిగిన ప్రమాదం లో అన్నీ కాలి బూడిద అవ్వడం చూశాం. ఈ ప్రమాదంలో మనుషులు…
S Name Astrology : సంఖ్యాయ శాస్త్రంలో ప్రతి ఒక అక్షరానికి ప్రత్యేక శక్తి, లక్షణాలు ఉంటాయి. మొదటి అక్షరం…
Ahmedabad Plane Crash : ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ 11 సంవత్సరాల పురాతన విమానం కాగా, అహ్మదాబాద్…
Today Gold Price : ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల…
This website uses cookies.