jagananna vidya kanuka to be given to govt school students
YS Jagan : ఏపీ వ్యాప్తంగా జూన్ 12 న అంటే ఇవాళ పాఠశాలలు అన్నీ తెరుచుకున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులు అందరికీ ఏపీ ప్రభుత్వం తరుపున కానుక ఇవ్వాలని భావించి.. 43 లక్షల మంది విద్యార్థులను జగనన్న విద్యా కానుకను అందించారు. ఈ సంవత్సరం జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తోంది. జగనన్న విద్యా కానుకలో భాగంగా.. యూనిఫామ్, షూ, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్ ఇస్తున్నారు.
అలాగే.. ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు, ఇతర సబ్జెక్టుల పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. సీఎం జగన్ పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని స్కూల్స్ ప్రారంభం రోజునే ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజాప్రతినిధులు ఆ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను అందించారు.ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదివి పది, ఇంటర్ పరీక్షల్లో టాప్ లో నిలిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు స్కీమ్ ను సీఎం జగన్ 20న ప్రారంభించనున్నారు. ఆయా స్కూళ్ల ఉపాధ్యాయులను, టాప్ లో నిలిచిన విద్యార్థుల పేరెంట్స్ ను కూడా సత్కరించనున్నారు.
jagananna vidya kanuka to be given to govt school students
ఇలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ మెరుగైన మార్కులు సాధించే ప్రతి విద్యార్థికి ఏపీ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరేలా సీఎం జగన్ రూపకల్పన చేశారు. చదువుల్లో చురుకుగా ఉండే పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అలాగే.. టెన్త్, ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు రాయకున్నా కూడా కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.