Categories: andhra pradeshNews

Chandrababu : చంద్ర‌బాబుకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్న కేఏ పాల్..!

Chandrababu : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరాక‌వారికి వ్య‌తిరేఖంగా జ‌గ‌న్ ఒక్క‌డే కాదు ష‌ర్మిళ‌, కేఏ పాల్ వంటి వారు కూడా గ‌ట్టిగా త‌మ వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఇన్‌ పర్సన్‌‌గా కోర్టులో పిటిషనర్‌ పాల్‌ స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీ ప్రస్తుత, గత ప్రభుత్వాలు సైతం ప్రత్యేక హోదా కోరుతున్న వైనాన్ని ప్రస్తావించారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరేందర్, జస్టిస్ కిరణ్ మై తో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేయడం విశేషం.

Chandrababu ప‌ట్టు బిగిస్తున్నాడు..

హోదా అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం, ఆర్థిక శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్‌ ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ప్రత్యేక హోదా అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని.. ప్రస్తుత పిల్‌ను కూడా వాటితో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టును కోరారు. గతంలో ప్రత్యేక హోదావపై దాఖలైన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పిల్‌ను కూడా వాటితో కలిపి ఏ బెంచ్‌ విచారణ చేయాలో నిర్ణయించేందుకు ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఏపీలో ప్రధాన సమస్యలపై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Chandrababu : చంద్ర‌బాబుకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్న కేఏ పాల్..!

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పిల్ దాఖలు చేసిన ఆయన.. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపైనా హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దని.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పైనా విచారణ జరుగుతోంది.. తాజాగా ప్రత్యేక హోదా అంశంపై కూడా విచారణ మొదలైంది. ఈ కేసుతో కెఏ పాల్ ఏపీలో హీరో అయ్యారు.కేసు తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది. ప్రత్యేక హోదాని అంతా మరచిపోతున్న తరుణంలో ఆ తేనే తుట్టెను కేఏ పాల్ కదిల్చారు. గత కొద్దిరోజులుగా కేఏ పాల్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడుతున్నారు. ఏదో విధంగా కేంద్రం చెవిలో జోరిగలా ఈ హోదా మాట వినిపించేలా చేశారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చేలా చేశారాయన.

Recent Posts

YCP : హరి హర వీరమల్లు పై ఎవ్వ‌రు మాట్లాడోద్దు.. వైసీపీ ఆదేశాలిచ్చిందా..?

YCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇటీవల కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన Ys Jagan అధినేత,…

56 minutes ago

Ticket Price Hike : అల్లు అర్జున్ కి అలా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఇలా.. రేవంత్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమర్శలు..!

Ticket Price Hike : సినీ టికెట్ల ధరల వివాదంపై తెలంగాణలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. పవన్ కళ్యాణ్…

2 hours ago

Wife : భ‌ర్త నాలుక‌ని కొరికి మింగేసిన భార్య‌..!

Wife : వామ్మో.. రోజు రోజుకూ కొందరు మనుషులు మృగాళ్లలా తయారు అవుతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలతో.. దంపతులు…

3 hours ago

Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టిన మేక‌ర్స్.. ఫ్యాన్స్ ఖుష్‌

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్…

3 hours ago

Komatireddy Raj Gopal Reddy : అవును రైతుబంధు అందరికి రాలేదు అని ఒప్పుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy :మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…

5 hours ago

Pawan Kalyan : అంత సున్నితంగా ఉండకండి.. ప్ర‌తి దాడిని తిప్పికొట్టండి : పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన…

7 hours ago

Today Gold Price : పసిడి ప్రియులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు.. బంగారం భారీగా తగ్గాయోచ్ !!

Today Gold Price : శ్రావణ మాసం Shravan maas ప్రారంభం కావడం తో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభావాలు…

7 hours ago

Guar : గోరు చిక్కుడు ఎంత పని చేసిందో తెలుసా..? ముగ్గురి ప్రాణాలు తీసింది..!

Guar : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జులై 22న జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. గోరుచిక్కుడు…

8 hours ago