AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు..?

 Authored By ramu | The Telugu News | Updated on :21 July 2025,12:01 pm

ప్రధానాంశాలు:

  •  AP Liquor Scam : బిగ్ బ్రేకింగ్‌.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు..!

  •  లిక్కర్ స్కామ్ ప్రైమరీ ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు

AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు విచారణకు కొత్త ఊపు వచ్చింది. ఈ కేసులో శనివారం ఎంపీ మిథున్ రెడ్డిని విచారించిన అనంతరం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో అమలులోకి వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పాలసీలో అవకతవకలద్వారా పెద్ద ఎత్తున అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్టు సమాచారం.

AP Liquor Scam ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు..!

AP Liquor Scam : జగన్ హయాంలోనే లిక్కర్ స్కామ్ జరిగింది – సిట్

ఈ కేసులో ఇప్పటికే అరవైకి పైగా మందుల కంపెనీలు, మధ్యవర్తులు, రాజకీయ ప్రముఖులపై అనేక ఆధారాలు సేకరించిన సిట్, తాజాగా 305 పేజీల ప్రిలిమినరీ ఛార్జ్ షీట్‌ను దాఖలు అయిన‌ట్లు స‌మాచారం. ఇందులో కొత్తగా మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో అనిరుధ్ రెడ్డి, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రూన్ ఉన్నారు. దీంతో లిక్కర్ స్కాం కేసులో నిందితుల సంఖ్య మొత్తం 48కి పెరిగింది.

ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్‌లో మొత్తం 16 మందిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మాధ్యమం వ్యక్తులు కూడా ఉన్నారు. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ విధానాలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలిచారని, భారీగా లాభాలు పొందారని సిట్ నివేదికలో పేర్కొంది. విచారణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలు ఈ కేసు తీవ్రతను స్పష్టంగా సూచిస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది