
Kodali Nani : పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు నాయుడు పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్...!
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ఒక్కొక్కరిగా నామినేషన్స్ వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పలుచోట్ల నుండి నామినేషన్స్ వేయగా ఇటీవల వైసీపీ నాయకుడు కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడం జరిగింది. నా నామినేషన్ కు పెద్ద సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజానీకం చాలామంది పాల్గొని విజయవంతం చేశారు.వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను . ఇక ఈ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికార పాలనను పూర్తిచేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల అనేక రకాల సభలను నిర్వహించి ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను , మళ్లీ అధికారంలోకి వస్తే చేసే మంచి గురించి మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తూ వచ్చారు.
అలాగే ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో కూడా వైసీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయడంలో ఎలాంటి సందేహం లేదంటూ కొడాలి నాని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అందించినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజానీకం అందరూ కూడా తిరిగి మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోరుకుంటున్నారని కొడాలి నాని తెలియజేశారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కొందరు జగన్ అది చేయలేదు ఇది చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఎన్నికలను ముగించాలని , దానికే వైసీపీ పార్టీ కట్టుబడి ఉందంటూ కొడాలి నాని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ , మేము అలాంటి వాటికి తెరదించమంటూ తెలిపారు.
Kodali Nani : పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు నాయుడు పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్…!
అలాగే చంద్రబాబు నాయుడు 2014లో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడో ఇప్పుడు కూడా అదే విధంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని కొడాలి నాని పేర్కొన్నారు.2014లో ఇచ్చిన మేనిఫెస్టోనే ఇప్పుడు కూడా చూపిస్తూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, 2014 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అని ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇదే రకమైనటువంటి మేనిఫెస్టోను చూపిస్తూ చంద్రబాబు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని తెలియజేశారు. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర ప్రజలు చంద్రబాబు మోసాలకు బలి కావద్దని సంక్షేమ పథకాలతో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకుంటున్నటువంటి జగన్ కు మరోసారి అధికారం ఇవ్వాల్సిందిగా కొడాలి నాని కోరారు.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.