Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ఒక్కొక్కరిగా నామినేషన్స్ వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పలుచోట్ల నుండి నామినేషన్స్ వేయగా ఇటీవల వైసీపీ నాయకుడు కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడం జరిగింది. నా నామినేషన్ కు పెద్ద సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజానీకం చాలామంది పాల్గొని విజయవంతం చేశారు.వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను . ఇక ఈ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికార పాలనను పూర్తిచేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల అనేక రకాల సభలను నిర్వహించి ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను , మళ్లీ అధికారంలోకి వస్తే చేసే మంచి గురించి మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తూ వచ్చారు.
అలాగే ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో కూడా వైసీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయడంలో ఎలాంటి సందేహం లేదంటూ కొడాలి నాని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అందించినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజానీకం అందరూ కూడా తిరిగి మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోరుకుంటున్నారని కొడాలి నాని తెలియజేశారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కొందరు జగన్ అది చేయలేదు ఇది చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఎన్నికలను ముగించాలని , దానికే వైసీపీ పార్టీ కట్టుబడి ఉందంటూ కొడాలి నాని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ , మేము అలాంటి వాటికి తెరదించమంటూ తెలిపారు.
అలాగే చంద్రబాబు నాయుడు 2014లో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడో ఇప్పుడు కూడా అదే విధంగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని కొడాలి నాని పేర్కొన్నారు.2014లో ఇచ్చిన మేనిఫెస్టోనే ఇప్పుడు కూడా చూపిస్తూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, 2014 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అని ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇదే రకమైనటువంటి మేనిఫెస్టోను చూపిస్తూ చంద్రబాబు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని తెలియజేశారు. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర ప్రజలు చంద్రబాబు మోసాలకు బలి కావద్దని సంక్షేమ పథకాలతో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకుంటున్నటువంటి జగన్ కు మరోసారి అధికారం ఇవ్వాల్సిందిగా కొడాలి నాని కోరారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.