KTR apologizes for his remarks on Andhra Pradesh
KTR : కేటీఆర్ ( కల్వకుంట్ల తారక రామారావ్) పాతికేళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డగా ఉండి గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని కాస్త అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులను తండ్రిలాగే చీల్చి చెండాడడంలో అందె వేసిన చేయి ఆయన ది.
KTR apologizes for his remarks on Andhra Pradesh
ఇదిలా ఉంటే తాజాగా అంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు అన్నట్టు పరోక్షంగా అక్కడి సమస్యలను వ్యంగంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు లేవు, రోడ్లు సరిగ్గాలేవు, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కేటీఆర్ విమర్షించాడు. అయితే ఆయన చేసిన విమర్శకు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ హీట్ ను పెంచేశాయి.
అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇదేమి ఎన్నికల సీజన్ కాదని మీ తప్పులను కప్పిపుచ్చుకోడానికి ఇతర రాష్ట్రాల గురించి తప్పుగా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మాటల తూటాలు పేల్చారు. చిత్తశుద్ధి ఉంటే 8 ఏళ్లుగా తెలంగాణ ను కేటీఆర్ ఎంత అభివృద్ధి చేశాడు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక రాబడి వున్న తెలంగాణ ను మీకిచ్చి చిల్లిగవ్వ కూడా లేని అంధ్రప్రదేశ్ ను విడగొట్టరాని అన్నారు. ఇలాంటి స్థితిలో వున్న కూడా అన్ని రంగాల్లో అంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చురకలంటించారు.
తన మీద విమర్శల దాడి అధికం కావడంతో కేటీఆర్ దిగొచ్చాడు. ట్విట్టర్ వేదికగా తన వివరణ ఇచ్చుకున్నాడు. తాను చేసిన ఆరోపణల ద్వారా నా స్నేహితుల మనసు కొంత బాధకలిగిండొచ్చు క్రెడాయ్ మీటింగ్ లో కొంతమంది మిత్రులు చెప్పిన విషయాలను నేను చెప్పాను అంతేగాని ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదన్నారు. ఎవరినో కించపర్చాలని, బాధ పెట్టాలని నేను మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. ఎవ్వరు బాధపడొద్దన్నారు. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా సోదరుడి లాంటి వాడని ఆయన ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడే ఆస్కారం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
This website uses cookies.