
KTR apologizes for his remarks on Andhra Pradesh
KTR : కేటీఆర్ ( కల్వకుంట్ల తారక రామారావ్) పాతికేళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డగా ఉండి గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని కాస్త అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులను తండ్రిలాగే చీల్చి చెండాడడంలో అందె వేసిన చేయి ఆయన ది.
KTR apologizes for his remarks on Andhra Pradesh
ఇదిలా ఉంటే తాజాగా అంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు అన్నట్టు పరోక్షంగా అక్కడి సమస్యలను వ్యంగంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు లేవు, రోడ్లు సరిగ్గాలేవు, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కేటీఆర్ విమర్షించాడు. అయితే ఆయన చేసిన విమర్శకు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ హీట్ ను పెంచేశాయి.
అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇదేమి ఎన్నికల సీజన్ కాదని మీ తప్పులను కప్పిపుచ్చుకోడానికి ఇతర రాష్ట్రాల గురించి తప్పుగా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మాటల తూటాలు పేల్చారు. చిత్తశుద్ధి ఉంటే 8 ఏళ్లుగా తెలంగాణ ను కేటీఆర్ ఎంత అభివృద్ధి చేశాడు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక రాబడి వున్న తెలంగాణ ను మీకిచ్చి చిల్లిగవ్వ కూడా లేని అంధ్రప్రదేశ్ ను విడగొట్టరాని అన్నారు. ఇలాంటి స్థితిలో వున్న కూడా అన్ని రంగాల్లో అంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చురకలంటించారు.
తన మీద విమర్శల దాడి అధికం కావడంతో కేటీఆర్ దిగొచ్చాడు. ట్విట్టర్ వేదికగా తన వివరణ ఇచ్చుకున్నాడు. తాను చేసిన ఆరోపణల ద్వారా నా స్నేహితుల మనసు కొంత బాధకలిగిండొచ్చు క్రెడాయ్ మీటింగ్ లో కొంతమంది మిత్రులు చెప్పిన విషయాలను నేను చెప్పాను అంతేగాని ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదన్నారు. ఎవరినో కించపర్చాలని, బాధ పెట్టాలని నేను మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. ఎవ్వరు బాధపడొద్దన్నారు. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా సోదరుడి లాంటి వాడని ఆయన ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడే ఆస్కారం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్సభలో కేంద్ర…
This website uses cookies.