
KTR apologizes for his remarks on Andhra Pradesh
KTR : కేటీఆర్ ( కల్వకుంట్ల తారక రామారావ్) పాతికేళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డగా ఉండి గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని కాస్త అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులను తండ్రిలాగే చీల్చి చెండాడడంలో అందె వేసిన చేయి ఆయన ది.
KTR apologizes for his remarks on Andhra Pradesh
ఇదిలా ఉంటే తాజాగా అంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు అన్నట్టు పరోక్షంగా అక్కడి సమస్యలను వ్యంగంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు లేవు, రోడ్లు సరిగ్గాలేవు, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కేటీఆర్ విమర్షించాడు. అయితే ఆయన చేసిన విమర్శకు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ హీట్ ను పెంచేశాయి.
అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇదేమి ఎన్నికల సీజన్ కాదని మీ తప్పులను కప్పిపుచ్చుకోడానికి ఇతర రాష్ట్రాల గురించి తప్పుగా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మాటల తూటాలు పేల్చారు. చిత్తశుద్ధి ఉంటే 8 ఏళ్లుగా తెలంగాణ ను కేటీఆర్ ఎంత అభివృద్ధి చేశాడు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక రాబడి వున్న తెలంగాణ ను మీకిచ్చి చిల్లిగవ్వ కూడా లేని అంధ్రప్రదేశ్ ను విడగొట్టరాని అన్నారు. ఇలాంటి స్థితిలో వున్న కూడా అన్ని రంగాల్లో అంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చురకలంటించారు.
తన మీద విమర్శల దాడి అధికం కావడంతో కేటీఆర్ దిగొచ్చాడు. ట్విట్టర్ వేదికగా తన వివరణ ఇచ్చుకున్నాడు. తాను చేసిన ఆరోపణల ద్వారా నా స్నేహితుల మనసు కొంత బాధకలిగిండొచ్చు క్రెడాయ్ మీటింగ్ లో కొంతమంది మిత్రులు చెప్పిన విషయాలను నేను చెప్పాను అంతేగాని ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదన్నారు. ఎవరినో కించపర్చాలని, బాధ పెట్టాలని నేను మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. ఎవ్వరు బాధపడొద్దన్నారు. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా సోదరుడి లాంటి వాడని ఆయన ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడే ఆస్కారం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక విధానాలకు ఆ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
Husband Wife : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు…
This website uses cookies.