KTR : కేటీఆర్ ( కల్వకుంట్ల తారక రామారావ్) పాతికేళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డగా ఉండి గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని కాస్త అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులను తండ్రిలాగే చీల్చి చెండాడడంలో అందె వేసిన చేయి ఆయన ది.
ఇదిలా ఉంటే తాజాగా అంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు అన్నట్టు పరోక్షంగా అక్కడి సమస్యలను వ్యంగంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు లేవు, రోడ్లు సరిగ్గాలేవు, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కేటీఆర్ విమర్షించాడు. అయితే ఆయన చేసిన విమర్శకు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ హీట్ ను పెంచేశాయి.
అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇదేమి ఎన్నికల సీజన్ కాదని మీ తప్పులను కప్పిపుచ్చుకోడానికి ఇతర రాష్ట్రాల గురించి తప్పుగా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ మాటల తూటాలు పేల్చారు. చిత్తశుద్ధి ఉంటే 8 ఏళ్లుగా తెలంగాణ ను కేటీఆర్ ఎంత అభివృద్ధి చేశాడు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక రాబడి వున్న తెలంగాణ ను మీకిచ్చి చిల్లిగవ్వ కూడా లేని అంధ్రప్రదేశ్ ను విడగొట్టరాని అన్నారు. ఇలాంటి స్థితిలో వున్న కూడా అన్ని రంగాల్లో అంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చురకలంటించారు.
తన మీద విమర్శల దాడి అధికం కావడంతో కేటీఆర్ దిగొచ్చాడు. ట్విట్టర్ వేదికగా తన వివరణ ఇచ్చుకున్నాడు. తాను చేసిన ఆరోపణల ద్వారా నా స్నేహితుల మనసు కొంత బాధకలిగిండొచ్చు క్రెడాయ్ మీటింగ్ లో కొంతమంది మిత్రులు చెప్పిన విషయాలను నేను చెప్పాను అంతేగాని ఎవ్వరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదన్నారు. ఎవరినో కించపర్చాలని, బాధ పెట్టాలని నేను మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. ఎవ్వరు బాధపడొద్దన్నారు. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా సోదరుడి లాంటి వాడని ఆయన ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడే ఆస్కారం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
This website uses cookies.