Ys Jagan : కూటమి కి షాక్ ఇస్తూ పాదయాత్ర 2.0 పై జగన్ బిగ్ బిగ్ బిగ్ నిర్ణయం..!
ప్రధానాంశాలు:
Ys Jagan : కూటమి కి షాక్ ఇస్తూ పాదయాత్ర 2.0 పై జగన్ బిగ్ బిగ్ బిగ్ నిర్ణయం..!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకోబోతున్న సంచలన నిర్ణయం. వచ్చే 2029 ఎన్నికలే టార్గెట్గా జగన్ తన అమ్ములపొదిలోని అసలైన అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. అదే పాదయాత్ర 2.0. గతంలో పాదయాత్ర ద్వారానే అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్ ఇప్పుడు మళ్ళీ అదే మంత్రాన్ని పఠించాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈసారి ఆయన ప్లాన్ మామూలుగా లేదు. కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇస్తూ తన పాదయాత్ర షెడ్యూల్లో భారీ మార్పులు చేసేశారు. నిజానికి వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు అంటే 2028లో పాదయాత్ర మొదలుపెట్టాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు మరియు కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన జగన్ తన యాత్రను అంతకంటే ముందే అంటే 2027 జూలై నుంచే ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు.
Ys Jagan : కూటమి కి షాక్ ఇస్తూ పాదయాత్ర 2.0 పై జగన్ బిగ్ బిగ్ బిగ్ నిర్ణయం..!
Ys Jagan : ప్రజా క్షేత్రంలోనే జగన్ పోరాటం
ఈ పాదయాత్ర నిర్ణయం వెనుక జగన్ చాలా పెద్ద వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీలోనో లేక సోషల్ మీడియాలోనో విమర్శలు చేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సుమారు ఒకటిన్నర ఏళ్ల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గడపకూ తిరుగుతూ ప్రజలతోనే ఉండబోతున్నారు. ఈ 2027 జూలై నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఎన్నికల వరకు నిరంతరాయంగా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల కూటమి సర్కార్ చేస్తున్న తప్పులను ఎండగట్టడంతో పాటు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవచ్చని జగన్ నమ్ముతున్నారు. ఈ నిర్ణయం విన్న కూటమి నేతలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఎందుకంటే జగన్ పాదయాత్ర మొదలుపెడితే అది రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో గతంలోనే అందరూ చూశారు. ఇప్పుడు అంతకంటే పక్కాగా వ్యూహ రచన చేయడం నిజంగా కూటమికి పెద్ద షాక్ అనే చెప్పాలి.
Ys Jagan : పాదయాత్రతో పాటు విజయవాడలో భారీ ప్లీనరీ
ఈ పాదయాత్రకు ముందే పార్టీని కేడర్ లెవల్ నుంచి సిద్ధం చేసేందుకు జగన్ రెడీ అయ్యారు. ఈ నెలలోనే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వైసీపీ పార్టీ ప్లీనరీని కూడా విజయవాడ మరియు గుంటూరు మధ్యలో నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లీనరీ వేదికగానే తన పాదయాత్ర 2.0 పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కేవలం పాదయాత్రే కాకుండా రాజధాని విషయంలో తాను చెప్పిన మావిగన్ కారిడార్ గురించి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. జగన్ తాజా నిర్ణయాలు చూస్తుంటే ఆయన వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. పాదయాత్ర మొదలైన తర్వాత చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తానని జగన్ ఇప్పటికే సవాల్ విసిరారు. మొత్తానికి జగన్ తీసుకున్న ఈ బిగ్ డెసిషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2029లో అధికారం తమదేనన్న ధీమాతో జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ పాదయాత్ర 2.0 తో రాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.