
Akhila Priya
Bhuma Akhila Priya : ప్రస్తుతం ఏపీ మొత్తం నంద్యాల జిల్లా వైపు చూస్తోంది. దానికి కారణం.. అక్కడి టీడీపీ రాజకీయాలు. అవును.. వేరే పార్టీల నేతల కొట్లాట అంటే అదీ కాదు. టీడీపీ పార్టీలోనే పలు వర్గాలుగా విడిపోయారు. అసలే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఈసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మరోవైపు యువనేత నారా లోకేశ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తన యువగళం పాదయాత్ర కూడా నంద్యాలకు చేరుకుంది.ఈనేపథ్యంలో టీడీపీ పార్టీలో వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. మొత్తం నాలుగు గ్రూపులుగా విడిపోయారు నంద్యాల టీడీపీ నేతలు.
నలుగురు నేతలు.. తమ వర్గంతో సపరేట్ గా యువగళం పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈనేపథ్యంలో భూమా అఖిలప్రియ అనుచరులు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే.నంద్యల టీడీపీకి అంతో ఇంతో మద్దతు ఇచ్చే జిల్లా. కాస్తో కూస్తో నంద్యాల నియోజకవర్గంలో ఉన్న బలం కాస్త ఇప్పుడు విభేదాల మూలంగా పోయిందనే చెప్పుకోవాలి. యువగళం పాదయాత్రలోనే టీడీపీ నేతలు దాడి చేసుకోవడంతో టీడీపీ కార్యకర్తల్లోనూ ఒకింత భయం నెలకొన్నది.
Akhila Priya
ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో భూమా అఖిలప్రియను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నంద్యాల కోర్టులో హాజరుపరిచి.. 14 రోజుల పాటు ఆమెతో పాటు భార్గవరామ్, మోహన్, సాయినాథ్ లను రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె కర్నూలు మహిళా సబ్ జైలులో ఉంది. ఆళ్లగడ్డ నుంచి లేదా నంద్యాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి భావిస్తున్నారు. అందుకే.. ఆయనపై వేరే వర్గం దాడి చేసిందని అంటున్నారు. చూద్దాం మరి.. నంద్యాల రాజకీయాలు ఇంకెంత దూరం వెళ్తాయో?
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
This website uses cookies.