Nara Lokesh నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9న ఆగిన పాదయాత్రను కోనసీమ జిల్లా నుంచి తిరిగి ప్రారంభించారు. ఇక కోనసీమ ప్రజలు కూడా నారా లోకేష్ కు నీరాజనం పలుకుతున్నారు. తాజాగా ఆయన కోనసీమలోని ముమ్మడివరం లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. లోకసభ స్పీకర్ గా బాలయోగి గారి రాజకీయ ప్రస్థానం కూడా ఈ ముమ్మడివరం నుంచే ప్రారంభమైంది. బాల యోగేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ ముమ్మడివరం. ఇలాంటి పుణ్యభూమిపై పాదయాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఉభయగోదావరి జిల్లాలలో జన ప్రభంజనం చూశాను. దీంతో మూడు నెలల్లో వైకాపా ఫ్యాను మాడి మసి పోవడం ఖాయం అని అన్నారు.
జగన్ ఒక సైకో. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారు. అవినీతి కేసు పెట్టి 53 రోజులు చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. కానీ ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఎందుకంటే అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబు గారి విలువ ఏంటో అందరికీ తెలిసింది. ఈ తరం యువతకి చంద్రబాబు అంటే ఏంటో తెలిసింది. వైసిపి నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద బ్రోకర్. చంద్రబాబును అవినీతిపరుడు చేయడానికి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఎలాంటి వాడో నిరూపించారు. జగన్ కి ఒక జబ్బు ఉంది. రాత్రి ఆత్మలతో మాట్లాడుతాడు. ఒక ఆత్మతో మాట్లాడాడు. ఆ ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుతో పవన్ ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలపకూడదు అని అంది.
కానీ చంద్రబాబు గారి దగ్గరకి పవన్ అన్న వచ్చి కలిసి పోరాడుదాం అని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. బాంబులకే భయపడం, కోర్టులో కేసులు వేస్తే భయపడతామా అని నారా లోకేష్ అన్నారు. సైకో జగన్ నా పాదయాత్రను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నా మైకు కూడా లాక్కున్నారు. ఈ గొంతు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఈ గొంతును నొక్కే మగాడు పుట్టలేదు అని అన్నారు. జగన్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తాను. ఏ అధికారులు అయితే జగన్ మాటని విని చట్టాన్ని ఉల్లంఘించారో వారు ఢిల్లీకి పారిపోయిన వాళ్లకి శిక్ష పడేలా చేస్తాను, పరు మూడు నెలల్లో టిడిపి అధికారంలోకి రాబోతుందని కచ్చితంగా ఈ వేధింపులకు బదులు తీర్చుకుంటానని రాజారెడ్డి రాజ్యాంగం పని అయిపోయిందని అంబేద్కర్ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిదీ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.