Nara Lokesh : యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్.. వణికిపోతున్న సొంత పార్టీ నేతలు
ప్రధానాంశాలు:
సొంత పార్టీ నేతలపై యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్
Nara Lokesh : యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్.. వణికిపోతున్న సొంత పార్టీ నేతలు
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రత్యర్థుల అవినీతిపై విమర్శలు చేయడం సహజం, కానీ లోకేష్ ఒక అడుగు ముందుకు వేసి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. “తమ-పర” అనే భేదం లేకుండా పాలన పారదర్శకంగా ఉండాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఒక భారీ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్న ఆయన, త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఆరోపణ వచ్చినా నిష్పక్షపాతంగా విచారణ జరిపి తీరుతామని ఆయన స్పష్టం చేయడం విశేషం.
Nara Lokesh : యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్.. వణికిపోతున్న సొంత పార్టీ నేతలు
Nara Lokesh అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతైనా శిక్ష అనుభవిచాల్సిందే అంటున్న లోకేష్
ఈ సరికొత్త విధానంలో భాగంగా ప్రజల కోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్ను కేటాయించనున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లేదా వారి అనుచరులు ఏవైనా తప్పులు చేస్తున్నా, అవినీతి దందాలకు పాల్పడుతున్నా ప్రజలు నేరుగా ఈ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడం ద్వారా ప్రజల్లో భయాన్ని పోగొట్టి, వారిని భాగస్వాములను చేయాలని లోకేష్ భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న తరుణంలో, అక్కడక్కడా వినిపిస్తున్న ఆరోపణలు పార్టీకి చెడ్డపేరు తీసుకురాకముందే సరిదిద్దుకోవాలన్నది ఆయన వ్యూహం. ఇది కేవలం ఎమ్మెల్యేలకే పరిమితం కాకుండా, అవినీతికి పాల్పడే అధికారుల పనితీరుపై కూడా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
Nara Lokesh : కీలక నిర్ణయం తీసుకున్న లోకేష్.. శభాష్ అంటున్న కొందరు , ఛీ అంటున్న మరికొందరు !!
ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల అధికార యంత్రాంగంలోనూ, ప్రజాప్రతినిధులలోనూ జవాబుదారీతనం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు, ప్రజల పట్ల వారి ప్రవర్తన ఎలా ఉందనే అంశాలపై ప్రజలకే ‘వజ్రాయుధం’ లాంటి ఫిర్యాదు చేసే హక్కును ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలు నేరుగా అధిష్టానానికి చేరుతాయి. విచారణలో తప్పు అని తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వ ఇమేజ్ను పెంచడంతో పాటు, వచ్చే ఎన్నికల నాటికి క్లీన్ గవర్నెన్స్ను ప్రజలకు చూపడమే ఆయన లక్ష్యం.