Vangaveeti Radha Krishna : వంగ‌వీటి రాధాకృష్ణ ద‌శ తిర‌గ‌నుందా.. మంత్రి ప‌ద‌వి వ‌రించే ఛాన్స్.!

Advertisement
Advertisement

Vangaveeti Radha Krishna : తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయవాడ మాస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధాను ఆంధ్రప్రదేశ్ మంత్రి , చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఐటి శాఖ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం విజయవాడ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విజయవాడకు వచ్చిన అనంతరం తాడేపల్లిలోని పాతూరులోని వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లారు. ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్యం కొంత క్షీణించ‌గా,ఇప్పుడిప్పుడే కుదుట ప‌డుతుంది.విజయవాడకు చెందిన అనేకమంది నాయకులు పార్టీలకు అతీతంగా వంగవీటి రాధాకృష్ణను పరామర్శించారు.

Advertisement

Vangaveeti Radha Krishna : మంత్రి ప‌ద‌వి వ‌రిస్తుందా..

వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని అనేక మంది నాయకులు కోరుకున్నారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధా ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో పర్యటించి కూటమి పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.వంగవీటి రంగా వారసుడిగా రాధాకృష్ణ ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం అంటే 2004లో కాంగ్రెస్ లో చేరి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. ఆ తరువాత ఆయన ప్రజారాజ్యంలో చేరి 2009లో పోటీ చేసినా వైసీపీలో చేరి 2014లో బరిలోకి దిగారు. మళ్ళీ గెలవలేకపోయారు. టీడీపీలోకి 2019 ఎన్నికల ముందు వచ్చిన రాధాకు అపుడూ 2024లోనూ కూడా టికెట్ దక్కలేదు.

Advertisement

Vangaveeti Radha Krishna : వంగ‌వీటి రాధాకృష్ణ ద‌శ తిర‌గ‌నుందా.. మంత్రి ప‌ద‌వి వ‌రించే ఛాన్స్.!

టీడీపీ త‌ర‌పున పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసి బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తుని టీడీపీకి క‌ట్ట‌బెట్టారు.దీంతో వంగ‌వీటికి ఏదో ఒక ప‌దవి ఇవ్వ‌బోతున్న‌ట్టుగా కొద్ది రోజులుగా ప్ర‌చారం ఉంది.తాజాగా రాధాని క‌లిసిన నారా లోకేష్‌.. పార్టీ తరఫున ఒక కీలక హామీని ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు ఎమ్మెల్యే కోటాలో ఒక సీటుని కేటాయిస్తామని స్పష్టం చేశారని ప్రచారం సాగుతోంది. ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో చూసుకుంటే బలమైన సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. రంగా వారసుడిగా రాధా రానున్న కాలంలో మరింతగా దూకుడు చేయడానికి ఆయనకు మంత్రి పదవి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక రాధాని మంత్రిని చేయడం ద్వారా కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గానికి మరింతగా చేరువ కావాలని అది జమిలి ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఉపయోగపడుతుందని కూడా అలోచిస్తున్నారు అని అంటున్నారు.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

6 hours ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

7 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

8 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

9 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

11 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

12 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

15 hours ago