AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2025,6:15 pm

ప్రధానాంశాలు:

  •  AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కీలక పరిణామంగా మారింది. దీని ఆధారంగా రాబోయే రోజుల్లో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకోనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాల సంఖ్యను 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2027 నాటికి పూర్తయ్యే జనగణన ఆధారంగా ఈ మార్పులు అధికారికంగా అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి…

AP ఏపీలో కొత్త వ్యూహాలు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. జగన్ , చంద్రబాబు మాస్టర్ ప్లాన్స్..!!

ఈ పరిణామాల దృష్ట్యా ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల జనాభా పెరుగుతోందన్న అంచనాల నేపథ్యంలో రిజర్వ్ నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. అలాగే, కొన్ని ప్రస్తుత ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు జనరల్‌గా మారే అవకాశం కూడా ఉంది. దీంతో, సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో పార్టీలు తమ వ్యూహాలను తిరిగి సమీక్షించే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల ఆధారంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉండటంతో నియోజకవర్గాల గమనాన్ని మార్చే దిశగా ఇది మారిపోతుంది.

ఇక ఈ పునర్విభజన ప్రక్రియ 2029లోనే అమలవుతుందా, లేక 2034 నాటికే రాజకీయ ప్రేరణలతో ముందుకు వస్తుందా అన్నది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఏపీ సీఎం జగన్ గతంలో ఒక్కో పార్లమెంట్ పరిధిని ఒక్కో జిల్లాగా మార్చిన విధానాన్ని దృష్టిలో ఉంచుకుంటే, వచ్చే పునర్విభజన రాజకీయంగా మరింత ప్రభావం చూపించనుంది. మహిళలకు రిజర్వేషన్, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పార్టీల అభ్యర్థుల ఎంపిక, సమీకరణలపై పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తు దిశగా పునర్వ్యవస్థీకరణ అనివార్యంగా మారనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది