Nimmagadda Ramesh: అమ్మో నిమ్మగడ్డ తెలివి - 'వైఎస్ వల్లే నేను ఇలా ఉన్నాను' అనడం వెనక టాప్ సీక్రెట్ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nimmagadda Ramesh: అమ్మో నిమ్మగడ్డ తెలివి – ‘వైఎస్ వల్లే నేను ఇలా ఉన్నాను’ అనడం వెనక టాప్ సీక్రెట్ ?

Nimmagadda Ramesh: ఏపీలో అధికార వైకాపా కు ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ చుక్కలు చూపిస్తున్నారు. మరో వైపు వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు చివరకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను టార్గెట్‌ చేసేలా మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్ వయసు దగ్గర పడ్డ ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సైలెంట్ గా వెళ్లి పోతే అంతా సాఫీగా సాగిపోయేది. కాని ఆయన స్థానిక సంస్థల ఎన్నిలక విషయంలో చాలా పట్టుదలగా […]

 Authored By himanshi | The Telugu News | Updated on :1 February 2021,12:45 pm

Nimmagadda Ramesh: ఏపీలో అధికార వైకాపా కు ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ చుక్కలు చూపిస్తున్నారు. మరో వైపు వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు చివరకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను టార్గెట్‌ చేసేలా మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్ వయసు దగ్గర పడ్డ ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సైలెంట్ గా వెళ్లి పోతే అంతా సాఫీగా సాగిపోయేది. కాని ఆయన స్థానిక సంస్థల ఎన్నిలక విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించి అధికార వైకాపాను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నాడు. దాంతో సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డికి చాలా కోపంగా ఉంది. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వైకాపా నాయకులను ఆలోచనల్లో పడేశాయి.

nimmagadda ramesh kumar interesting comments on ys rajashekhar reddy

nimmagadda ramesh kumar interesting comments on ys rajashekhar reddy

Nimmagadda Ramesh: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గొప్ప వ్యక్తి..

ఇటీవల జిల్లాల పర్యటనలో పాల్గొన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ తనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అంటే అమితమైన గౌరవం అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు. ఆయన హయాంలో పని చేసే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా భావ స్వేచ్చ హక్కును ఇచ్చే వారు. ఆయన ప్రతి ఒక్కరి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే వారు. ఏ ఒక్క సందర్బంలో కూడా ఆయన వద్ద పని చేస్తున్నప్పుడు ఇబ్బంది పడింది లేదని చెప్పుకొచ్చాడు. నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చి పని చేసుకునే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి.

నిమ్మగడ్డ వ్యాఖ్యలతో వైకాపా సైలెంట్‌…

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తనకు పూర్తి స్వేచ్చ దక్కిందని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలతో వైఎస్‌ జగన్‌ అభిమానులు మరియు వైకాపా నాయకులు సైలెంట్‌ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇండైరెక్ట్‌ గా జగన్ తీరును తప్పుబట్టడంతో పాటు వైకాపా నాయకుల అత్యుత్సాహంకు కౌంటర్ ఇచ్చాడు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిమ్మగడ్డ వ్యాఖ్యలతో కొందరు అయ్యో ఇన్ని రోజులు పెద్దాయన్ను ఇబ్బంది పెట్టాం. ఆయనకు మన పెద్దాయన అంటే ఇంత గౌరవమా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ ప్లాన్‌ ఇలా వర్కౌట్‌ అయ్యిందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది