
Nimmala Ramanaidu : నిజాలు తెలుసుకోండి నిమ్మల గారు అంటూ కామెంట్.. ఏం జరుగుతుందో తెలుసా?
Nimmala Ramanaidu : విజయవాడ వరదల సందర్బంగా ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. అయితే గత 15 రోజుల్లో ఏపీ పాలిటిక్స్ లో పరిణామాలు గమనించిన వారికి కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. యాదృచ్చికమో లేక పక్కా ప్లానింగో చెప్పలేం కానీ కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్లస్ లు గత పక్షం రోజుల్లో ఎదురైతే స్ట్రాటజీ లోపంతో వైసీపీకి కొన్ని అంశాలు మైనస్ గా మారాయి. విజయవాడ లోని సగభాగం మునిగింది అని తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన మకాం విజయవాడ కలెక్టరేట్ లోనే ఏర్పాటు చేసుకుని 10 రోజులు అక్కడినుండే వార్ రూమ్ నడిపించారు. 70 ఏళ్లు దాటినా, ఈ వయసులో సైతం వరద నీటిలో, బోట్లలో తిరుగుతూ నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
ప్రజలు ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో వారు తమను ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తారు తప్పించి రాజకీయాల గురించి అసలు పట్టించుకోరు. వైసీపీ ఈ విషయాన్ని ఎందుకో సరిగ్గా గమనించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు.. వరద బాధితుల `సంతృప్తి`పై మాట్లాడారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ఎంతో చేశామని అన్నారు. కాని కొందరు మాత్రం దానిపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో మురికి నీరు అడుగు వరకు ఉంది. ఇది పోయే మార్గం లేక.. అధికారులే తలలు పట్టుకుంటున్నారు.
Nimmala Ramanaidu : నిజాలు తెలుసుకోండి నిమ్మల గారు అంటూ కామెంట్.. ఏం జరుగుతుందో తెలుసా?
ఇంకా నిత్యావసరాలు అందని బాధితులు 30 వేల మంది ఉన్నారని ప్రభుత్వమే చెబుతోంది. 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పోటెత్తిన వరదల కారణంగా.. సామాజిక భద్రతా పింఛన్లు అందుకోనివారు.. నానా తిప్పులు పడుతున్నారు. నిండా మునిగిన నీటితో ఆటోలు, వాహనాలు పాడైపోయి.. సాధారణ జీవులు ఆపశోపాలు పడుతున్నారు. నిమ్మలకు 96 శాతం సంతృప్తిగా ఉన్నారని ఎవరు చెప్పారో.. అర్ధంకావడం లేదు. కొంతమంది ఫేక్ గాళ్ల సర్వేలు.. మాటలు వినే.. గతంలో చంద్రబాబు.. తర్వాత.. జగన్.. నష్టపోయారు. ఇప్పటికైనా.. క్షేత్రస్థాయికి వెళ్తే.. పరిస్థితి ఎంత సంతృప్తిగా ఉందో తెలుస్తుంది నిమ్మల సార్ అంటూ కొందరు ఆయనకి నచ్చజెపుతున్నారు.
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
This website uses cookies.