Balineni Vs Damacharla : బాలినేని vs దామచర్ల .. చంద్రబాబు కి తగ్గని తలనొప్పి..?
Balineni Vs Damacharla , ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జనసేన నేత బాలినేని శ్రీనివాసులురెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. ఇసుక, మైనింగ్, బార్ల వ్యవహారంపై పరస్పర ఆరోపణలతో కూటమిలో కలకలం రేగింది.
Balineni Vs Damacharla : ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇసుక, మైనింగ్, వైన్స్, బార్లలో మామూళ్ల వ్యవహారంపై ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో కూటమిలోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతున్న ఈ రాజకీయ వైరం.. బాలినేని జనసేనలో చేరిన తర్వాత మరింత ముదిరిందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇద్దరూ కూటమిలోనే ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం రెండు పార్టీల మధ్య సమన్వయంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
Balineni Vs Damacharla : బాలినేని vs దామచర్ల .. చంద్రబాబు కి తగ్గని తలనొప్పి..?
Balineni Vs Damacharla బాలినేని తీవ్ర ఆరోపణలు.. దామచర్లపై ఘాటు వ్యాఖ్యలు
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తీరుపై బాలినేని శ్రీనివాసులురెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరాచకాలు పెరిగిపోయాయని, తానే రాజు.. తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఇసుక, మైనింగ్, వైన్స్ వ్యవహారాల్లో ఎమ్మెల్యేకు రోజువారీ మామూళ్లు అందుతున్నాయని బాలినేని ఆరోపణలు చేశారు. తన కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అవసరమైతే ఎంతవరకైనా వెళ్తామని హెచ్చరించారు.బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఒంగోలు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటికే రెండు పార్టీల స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలు ఈ వ్యాఖ్యలతో మరింత బహిరంగంగా మారాయి.
Balineni Vs Damacharla దామచర్ల కౌంటర్.. బాలినేనిపై సంచలన విమర్శలు
బాలినేని ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని తండ్రీకొడుకులు బార్ల సిండికేట్ ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు.బాలినేని పార్టీ మారకుండా వైసీపీలోనే కొనసాగి ఉంటే.. ఈపాటికి ఆయనను జైలులో పెట్టేవాళ్లమని దామచర్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన ముసుగులో బాలినేని ఒంగోలులో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.ఇలా ఇద్దరు కూటమి నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచే దామచర్ల, బాలినేని మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. బాలినేని జనసేనలో చేరిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడం రెండు పార్టీల మధ్య సంబంధాలపై ఆందోళన పెంచుతోంది.
Balineni Vs Damacharla తొలి నుంచీ రాజకీయ ప్రత్యర్థులే..
బాలినేని శ్రీనివాసులురెడ్డి, దామచర్ల జనార్ధన్ మధ్య రాజకీయ వైరం కొత్తది కాదు. దశాబ్దాలుగా ఇద్దరూ ప్రత్యర్థి శిబిరాల్లో ఉంటూ రాజకీయంగా తలపడుతున్నారు. దామచర్ల మొదటి నుంచీ టీడీపీలో కొనసాగుతుండగా.. బాలినేని గతంలో కాంగ్రెస్, వైసీపీలో పనిచేశారు. ఆయా పార్టీల తరఫున దామచర్లపై పోటీ చేసి పలుమార్లు విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్న సమయంలో ఈ రాజకీయ పోటీ సహజంగానే కనిపించింది. కానీ 2024 ఎన్నికల అనంతరం బాలినేని శ్రీనివాసులురెడ్డి జనసేనలో చేరడం, ఆ పార్టీలో కీలక నేతగా మారడం పరిస్థితిని మార్చింది. కూటమిలో భాగమైన జనసేనలో బాలినేని చేరడాన్ని దామచర్ల మొదటి నుంచీ వ్యతిరేకించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. చివరి వరకు ఆయనను పార్టీలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలించలేదనే ప్రచారం ఉంది.
ఇప్పుడు మరోసారి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ముదరడంతో ఒంగోలులో టీడీపీ–జనసేన మధ్య సమన్వయం ఎలా కొనసాగుతుందనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. స్థానికంగా నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటే కూటమి రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉందని ఇరు పార్టీల శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ముఖ్యంగా వచ్చే రోజుల్లో ఈ వివాదం మరింత ముదరకుండా రెండు పార్టీల అగ్ర నాయకత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లేకపోతే వ్యక్తిగత, రాజకీయ విభేదాలు కూటమి మధ్య సమన్వయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ప్రస్తుతం బాలినేని–దామచర్ల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుంది? రెండు పార్టీల అధిష్ఠానాలు ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తాయి? ఒంగోలులో కూటమి ఐక్యత కొనసాగుతుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.







