
Chandrababu : ఎన్టీయేతోనే మా పయనం.. ప్రజాసేవకులగా పని చేస్తాం.. చంద్రబాబు..!
Chandrababu : Andhra pradesh ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూటమికి భారీ విజయాన్ని అందించడంపై ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని TDP టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన Press Meet మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో చూడలేదని చెప్పారు. అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని.. దేశం, ప్రజాస్వామ్యమే శాశ్వతం అన్నారు. పార్టీలు సరిగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని తెలిపారు. ఇలాంటి ఎన్నికలు తాను ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో విదేశాల్లో ఉన్నవారు సైతం వచ్చి ఓట్లు వేశారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నికలు ఇవి అన్నారు. జగన్ ప్రభుత్వం విచ్చలవిడి అవినీతికి, అరాచకాలకు పాల్పడడం వలనే ఆ పార్టీకి ఈ గతి పట్టిందని ఆరోపించారు. Ys Jagan జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులను, కార్యకర్తలను హింసించిందని, వారికి కంటి నిండా కునుకులేకుండా చేశారని అన్నారు.
Chandrababu : ఎన్టీయేతోనే మా పయనం.. ప్రజాసేవకులగా పని చేస్తాం.. చంద్రబాబు..!
జై తెలుగు దేశం అంటే ప్రాణాలు తీశారని, జై జగన్ అనాలని హింసించారని ఆరోపించారు. మీడియా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునేలా జగన్ పాలన సాగిందని ధ్వజమెత్తారు. తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్ చెప్పేవారని గుర్తు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏలో భాగస్వాములుగా బాధ్యతతో ముందుకెళ్తామని ప్రకటించారు.
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
This website uses cookies.