
Pawan kalyan : పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ .. రెండు సర్వేలు తేల్చిందేంటంటే.. ?
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారు అనేదానిపై ఇంతవరకు అధికారిక సమాచారం అయితే రాలేదు. వారం క్రితం టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి. అందులో 94 మందితో టీడీపీ జాబితా విడుదల చేస్తే ఐదుగురు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. టీడీపీ మొదటి జాబితాలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారు. మరి జనసేన ఫస్ట్ జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం ఆశ్చర్యమే అని అంటున్నారు. బీజేపీ జాతీస్థాయిలో తొలి జాబితా విడుదల చేస్తే అందులో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లాంటి వారు ఉంటారు. పార్టీ పెద్దలు తొలి జాబితాలో ఉండడం ఆనవాయితీ. కానీ జనసేన తొలి జాబితాలో డిప్యూటీ లీడర్ నాదెండ్ల మనోహర్ తో మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అది నిజమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లి టీడీపీ నేతలతో సమావేశం జరిపారు. వారి మద్దతుని కూడా అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొత్తగా పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలోకి దిగబోతున్నారని న్యూస్ వైరల్ అవుతుంది. ఇది జనసేన వర్గాలకు అంతర్గతంగా తెలిసిన వార్త అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి అన్నదానిపై రెండు సర్వేలు ఫిబ్రవరి నెలలో చేయించుకున్నారని అంటున్నారు.
ఆ సర్వేలో మొత్తం రెండున్నర లక్షల మంది దాకా ఉండే పిఠాపురం జనాభాలో 60 వేల మంది దాకా కాపులు ఉన్నారట. వారంతా పవన్ కళ్యాణ్ కి ఓటేస్తే మిగిలిన సామాజిక వర్గాలు వారు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని, అంతే కాకుండా భారీ మెజారిటీ కూడా సాధిస్తారని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పిఠాపురంలో మొత్తం రెండున్నర లక్షల మందిలో 60 వేల మంది కాపులు ఉంటే మిగిలిన లక్షా 90 వేల మంది బీసీలు, ఎస్సీ, బడుగు ఇతర సామాజిక వర్గాల వారు ఉన్నారు. మరి వారంతా కూడా ఓటు వేయాలి కదా అని చర్చ మొదలైందట. గోదావరి జిల్లాలో బీసీలు ఎస్సీ ఇతర సామాజిక వర్గాలకు విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు కాపులకు పడదు అని ప్రచారం ఉంది. కులాల వారి చీలిపోయిన నేపథ్యం అంతట ఉంది. ఈ క్రమంలో కాపులు అంతా కట్టకట్టుకుంటే అది మేలే కానీ మిగిలిన వారు ఐక్యత చూసి రివర్స్ అవుతారు. ఆ ఓటు అప్పుడు ప్రత్యర్థికి ఈజీగా టర్న్ అవుతుంది. ఈ సామాజిక సమీకరణాలలో ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ గెలిచి మూడు దశాబ్దాలు గడిచింది. ఆ పార్టీ 1983 నుంచి మూడుసార్లు మాత్రమే గెలిచింది. ఇక కాపులే ఎక్కువసార్లు ఇక్కడ గెలిచారు.
అంతేకాకుండా లోకల్స్ కి ఇక్కడి ప్రజలు పెద్దపీట వేశారు. తమ అభ్యర్థి తమ ప్రాంతంలో ఉండాలని, తమకు కనిపించాలని, మంచికి చెడ్డకు తమకు అందుబాటులో ఉండాలని ఆ నియోజకవర్గం వారికి ఉంది అని అంటున్నారు. మరోవైపు గతంలో కాంగ్రెస్ కి ఇక్కడ బాగా బలం ఉంది. అనేక సార్లు గెలిచింది. అదంతా ఇప్పుడు వైసీపీకి టర్న్ అయింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో వంగా గీత గెలిచారు. ఇప్పుడు ఆమె వైసీపీలో ఉన్నారు. అయితే ఆమెకు అప్పట్లో 1000 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్, టీడీపీ తో సమానంగా ఆమెకు ఓట్లు వచ్చాయి. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 28 వేల ఓట్లు వచ్చాయి. ఆమె స్థానికంగా ఉంటూ కష్టపడ్డారు. దాంతో ఆమెకు ఓటు షేర్ వచ్చింది అని అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే టీడీపీ లో మాజీ ఎమ్మెల్యే వర్మ బలంగా ఉన్నారు. ఆయన 2014లో ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాటారు. ఆయన తనకు టికెట్ దక్కకపోతే 2014 రిపీట్ అవుతుందని అంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకి సొంత ఇమేజ్ ఉంది. ఈ క్రమంలో పిఠాపురంలో జనసేన పోటీ అంటే అన్ని వర్గాల వారిని కలుపుకుపోవాలి అదే సమయంలో టీడీపీ, జనసేన ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిసి పని చేస్తే పవన్ కళ్యాణ్ కి విజయం ఖాయమని అంటున్నారు.
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
Railway Jobs : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం…
Ration Cards : దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ సేవలను మరింత…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల…
Gold and Silver Price 14 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి, పసిడి ప్రియులకు…
Karthika Deepam 2 March 14th 2026 Today Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం…
Healthy Drinks : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. ఈ సమయంలో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయాల కోసం…
Black Coffee Benefits : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. ముఖ్యంగా పాలు,…
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
This website uses cookies.