
Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..!
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప ముఖ్యమంత్రి Pawan Kalan పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పవన్ వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భయపెట్టడం, రౌడీయిజం, గూండాయిజంతో పాలించడం వల్లే వైసీపీకి ప్రజలు బుద్దిచెప్పారని వ్యాఖ్యానించారు. “2029లో అధికారంలోకి వస్తే మిమ్మల్ని వదలము” అని వైసీపీ నేతలు అంటున్నారని పేర్కొన్న పవన్, “ముందు అధికారంలోకి రావాలి కదా? ఎలా వస్తారో చూద్దాం” అంటూ ఘాటుగా స్పందించారు.
Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో
తాను సినిమాల నుంచి వచ్చినవాడినే కానీ, సినిమా డైలాగులు చెప్పడం తన స్వభావం కాదని, ప్రజల కోసం నిజమైన రాజకీయ సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై తనకెంతో వ్యక్తిగత అనుబంధం ఉందని, చిన్నప్పుడు కనిగిరిలో కొన్ని నెలలు నివసించిన సమయంలో ఫ్లోరైడ్ సమస్య తాలూకు భయానక అనుభవం తనకు మిగిలిందని వివరించారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన ఈ తాగునీటి ప్రాజెక్టు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లాలో జరిగిన అతిపెద్ద అభివృద్ధి పథకంగా పేర్కొన్నారు. 18 మండలాల్లో 572 గ్రామాలకు ఈ పథకం ద్వారా మంచినీరు అందిస్తామని, 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనులకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పవన్ ఆరోపించారు. కేంద్రం 26,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినా, వైసీపీ కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి వాటిని వృథా చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడానికి ఆ కారణమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వంగా తామే నిధులు తీసుకొచ్చామని, ప్రత్యేకంగా ఎంపీల విజయంతో కేంద్రానికి “ఆక్సిజన్” ఇచ్చామని తెలిపారు. దేవాలయ భూముల పరిరక్షణపై కూడా తీవ్ర స్థాయిలో స్పందించిన పవన్, వైసీపీ హయాంలో వీటిని దోచిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి అంటే పిడికిలిలాంటిది అని, అందరూ కలసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 15 సంవత్సరాలపాటు కూటమిని నిలబెడితే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.