Ys Jagan : ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి..? బెదిరింపులు ఏంటి.. ? – జగన్ ఫైర్ .. వీడియో
ప్రధానాంశాలు:
కూటమి ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు - జగన్
మా పార్టీ నేతలపై చంద్రబాబు కక్ష్య కట్టాడు - జగన్
Ys Jagan : ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి..? బెదిరింపులు ఏంటి.. ? - జగన్ ఫైర్ .. వీడియో
Ys Jagan : ఆంధ్రప్రదేశ్లో పాలన పరంగా నెలకొన్న పరిణామాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం తమ పార్టీపై దుష్ప్రచారంతో పాటు అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. “ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి? బెదిరింపులు ఏంటి?” అంటూ చంద్రబాబు పై జగన్ మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు అబద్ధాల పాలన కోసం ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.

Ys Jagan : ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి..? బెదిరింపులు ఏంటి.. ? – జగన్ ఫైర్
Ys Jagan : కూటమి ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం – జగన్
తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపు చర్యలు చేస్తున్నారని స్పష్టం చేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు వంటి పలువురు కీలక నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. గన్మెన్ను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వించాలని పాల్పడిన చర్యలు దారుణమని జగన్ అన్నారు. మద్యం కేసులో చట్ట విరుద్ధంగా అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు.
చంద్రబాబు పాలన ప్రారంభమై ఒక సంవత్సరం కావొచ్చే లోపే ప్రజల్లో అసహనం పెరిగిందని జగన్ పేర్కొన్నారు. దీనిని దాచేందుకు టీడీపీ ప్రభుత్వం “డైవర్షన్ పాలిటిక్స్” ద్వారా వైఎస్సార్సీపీపై అప్రచారానికి దిగుతోందని విమర్శించారు. రెంటపాళ్ల, పొదిలి ఘటనలను ప్రస్తావిస్తూ, తమ కార్యకర్తల పట్ల పోలీసులు అవలంభిస్తున్న దౌర్జన్య చర్యలను ఖండించారు. “ప్రజల సమస్యలు ఎత్తి చూపిన వారిపై కూడా కేసులు పెడితే ప్రజాస్వామ్యంలో విలువలు ఎలా ఉంటాయంటారు?” అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన తీరుపై ప్రజల్లో ఆవేదన తీవ్రంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి? బెదిరింపులు ఏంటి?: వైఎస్ జగన్
వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏంటి?
ప్రజలు దయతలిచి అధికారం ఇచ్చారు
ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి అబద్దాలతో, మోసాలతో చంద్రబాబు పరిపాలన చేస్తున్నారు
ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను… pic.twitter.com/tSSwXCcdH4
— BIG TV Breaking News (@bigtvtelugu) June 19, 2025