Perni Nani : మేము ఛీ కొట్టినోడిని.. వాళ్లు పక్కన చేర్చుకున్నారు.. ప్రశాంత్ కిషోర్ పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Perni Nani : మేము ఛీ కొట్టినోడిని.. వాళ్లు పక్కన చేర్చుకున్నారు.. ప్రశాంత్ కిషోర్ పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఏపీలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు. మళ్లీ ఏపీలో ఎవరి రాజ్యం రాబోతోందని అంతా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలను ఎలా ఆకర్షించాలో పథకాలు రచిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  పవన్ కళ్యాన్ మీద కూడా చంద్రబాబుకు నమ్మకం లేదా?

  •  టీడీపీ శ్రేణుల మీద కూడా నమ్మకం లేదా?

  •  అందుకే పీకేను పక్కన చేర్చుకున్నాడా?

Perni Nani : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఏపీలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు. మళ్లీ ఏపీలో ఎవరి రాజ్యం రాబోతోందని అంతా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలను ఎలా ఆకర్షించాలో పథకాలు రచిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై భేటీ అయ్యారు. ఆయన్ను ప్రశాంత్ కలవడంపై తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. అసలు చంద్రబాబుకు సిగ్గు, శరం ఏమైనా ఉందా? ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు.. లోకేష్ ఏం మాట్లాడాడు. బీహారోడు వాడు.. ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు అని అన్నారు. బీహారోడి ఆట కట్టిస్తాం.. తోలు తీస్తాం.. అన్నారు. ఇవన్నీ ఏపీ ప్రజలు విన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ బీహారోడితో ఎందుకు చేతులు కలిపారు అంటూ మండిపడ్డారు.

నిజంగానే చంద్రబాబుకు అంత నమ్మకం ఉంటే.. పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు కదా. పవన్ మీద కూడా నమ్మకం లేదా? అందుకే పీకేను తెచ్చి పెట్టుకున్నారా? టీడీపీ శ్రేణులపై కూడా నమ్మకం లేదా? అందుకే పీకే టీమ్ తో వ్యూహాలు రచిస్తున్నారా? మీరు ఎన్ని వ్యూహాలు రచించినా.. ఏం చేసినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనాల గుండెల్లో ఉన్నారు. ఏపీలో మరోసారి వైసీపీ గెలుపు ఖాయం. వైసీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు అని పేర్ని నాని స్పష్టం చేశారు.

Perni Nani : ప్రజలను నమ్ముకోలేదు మీరు.. పీకేను నమ్ముకున్నారు

మీరు ప్రజలను నమ్ముకోలేదు.. పీకేను నమ్మకున్నారు. మాకు ఎవ్వరి సలహాలు అక్కర్లేదు.. మాకు ప్రజలు ఉన్నారు. మేము ప్రజలను నమ్ముకున్నాం అని లోకేష్ గప్పాలు కొట్టాడు. కానీ.. చివరకు పవన్ మీద నమ్మకం లేక.. టీడీపీ నేతల మీద నమ్మకం లేక.. మేము ఛీ కొడితే బయటికి వెళ్లిన వాడిని గతిలేక బతిమాలి మరీ తెచ్చుకున్నారు.. అంటూ పేర్ని నాని అన్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది