
Ram Mohan Naidu , lokesh
Lokesh & Ram Mohan Naidu : తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఒక పెద్ద కుటుంబంలా కొనసాగుతూ వస్తోంది. ఎవరు ఏ స్థాయి పదవిలో ఉన్నా పార్టీ అధినేతలను కుటుంబ పెద్దల్లా గౌరవించడం ఆ పార్టీ సంప్రదాయం. తాజాగా విశాఖపట్నంలోని నోవాటెల్లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మధ్య చోటుచేసుకున్న సంఘటన దీనికి మరొక నిదర్శనంగా నిలిచింది. వయసులో పెద్దవాడు లోకేష్ అయినప్పటికీ హోదాలో రామ్మోహన్ నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ఈ సమావేశంలో ఇద్దరూ పదవులను పక్కన పెట్టి అన్నదమ్ముల్లా ప్రవర్తించడం సభలోని ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది.
Ram Mohan Naidu , lokesh
సదస్సు కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి చివరగా మాట్లాడాల్సి ఉంది. కానీ నారా లోకేష్ ప్రసంగం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. దీనిని గమనించిన రామ్మోహన్ నాయుడు “అన్నా ముందు నేను మాట్లాడతాను” అంటూ లేవగా, లోకేష్ వెంటనే వారిస్తూ “వద్దు రాము… నువ్వు కేంద్ర మంత్రి కాబట్టి చివర్లో మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతాను” అని సరదాగా స్పందించారు. పదవుల హోదాలను పక్కనబెట్టి అన్నదమ్ముల్లా వారిద్దరి మధ్య చోటుచేసుకున్న ఈ చిన్న సంఘటన సభలో ఉన్న వారిని అలరించింది.
ఈ పరిణామం కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ఏమైనా చిన్నపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కనబెట్టి కలిసి పనిచేస్తున్నారనే స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా వైసీపీ నేతలు కూటమిలో విభేదాలున్నాయని చేస్తున్న ప్రచారానికి ఈ సంఘటన బలమైన సమాధానంగా నిలిచింది. లోకేష్, రామ్మోహన్ నాయుడు ప్రదర్శించిన ఆత్మీయత, సమన్వయం కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి కట్టుబడి ఉందనే నమ్మకాన్ని కలిగించింది.
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
This website uses cookies.