
rushikonda palace
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్లు, బాత్ రూమ్లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజాధనాన్ని ఇలా ప్యాలెస్ల నిర్మాణానికి వినియోగించడం ఎంతవరకు అవసరం అనే ప్రశ్నను లేవనెత్తుతూ, ప్రజా డబ్బును సరైన విధంగా వినియోగించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భవనాన్ని చూస్తున్న సమయంలోనే సీలింగ్ పైపెచ్చులు ఉండడం చూసి షాక్ కు గురయ్యారు.
ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత పరిస్థితులను పవన్ కల్యాణ్కు వివరించారు. గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఈ భవనాల నిర్వహణకే కోటి రూపాయలకుపైగా బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించారు. ఈ నిర్మాణాలపై గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు కొనసాగుతోందని, ఆర్థికపరంగా, పర్యావరణపరంగా ఇది భారమవుతోందని అధికారులు వివరించారు.
పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రకృతిని విస్మరించి ఇలాంటి నిర్మాణాలు చేస్తే ఉన్న సౌందర్యం కూడా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. రుషికొండ నిర్మాణాల ఖర్చు, పర్యావరణ ప్రభావం, విధ్వంసం వంటి అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఈ నిర్మాణాలను పరిశీలించనీయలేదని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రజల ముందుకు నిజాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. భవనాలు పాడైపోకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
OPPO Find X9 Ultra Review : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) గ్లోబల్ మార్కెట్లో తన మోస్ట్…
Central Govt Good News to Telangana : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి భారీ వరాలను ప్రకటించింది. మత్స్యకారుల…
This website uses cookies.