
rushikonda palace
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్లు, బాత్ రూమ్లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజాధనాన్ని ఇలా ప్యాలెస్ల నిర్మాణానికి వినియోగించడం ఎంతవరకు అవసరం అనే ప్రశ్నను లేవనెత్తుతూ, ప్రజా డబ్బును సరైన విధంగా వినియోగించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భవనాన్ని చూస్తున్న సమయంలోనే సీలింగ్ పైపెచ్చులు ఉండడం చూసి షాక్ కు గురయ్యారు.
ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత పరిస్థితులను పవన్ కల్యాణ్కు వివరించారు. గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఈ భవనాల నిర్వహణకే కోటి రూపాయలకుపైగా బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించారు. ఈ నిర్మాణాలపై గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు కొనసాగుతోందని, ఆర్థికపరంగా, పర్యావరణపరంగా ఇది భారమవుతోందని అధికారులు వివరించారు.
పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రకృతిని విస్మరించి ఇలాంటి నిర్మాణాలు చేస్తే ఉన్న సౌందర్యం కూడా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. రుషికొండ నిర్మాణాల ఖర్చు, పర్యావరణ ప్రభావం, విధ్వంసం వంటి అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఈ నిర్మాణాలను పరిశీలించనీయలేదని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రజల ముందుకు నిజాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. భవనాలు పాడైపోకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
This website uses cookies.