Rayalaseema : సంచ‌ల‌నంగా మారిన స‌ర్వే.. సీమ‌లో ఆ స్థానాలు వైసీపీకేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rayalaseema : సంచ‌ల‌నంగా మారిన స‌ర్వే.. సీమ‌లో ఆ స్థానాలు వైసీపీకేనా..?

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2025,1:22 pm

ప్రధానాంశాలు:

  •  Rayalaseema : సంచ‌ల‌నంగా మారిన స‌ర్వే.. సీమ‌లో ఆ స్థానాలు వైసీపీకేనా..?

Rayalaseema : ఏపీ రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన క్ర‌మంలో వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. కూటమి ఏడాది పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని మాజీ సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. దీంతో, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరుబాటకు సిద్దమయ్యారు.

Rayalaseema సంచ‌ల‌నంగా మారిన స‌ర్వే సీమ‌లో ఆ స్థానాలు వైసీపీకేనా

Rayalaseema : సంచ‌ల‌నంగా మారిన స‌ర్వే.. సీమ‌లో ఆ స్థానాలు వైసీపీకేనా..?

Rayalaseema : లెక్క‌లు మారాయి..

ప్రముఖ సర్వే సంస్థ రైజ్ ఏపీలో కూటమి ఏడాది పాలన వేళ ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రజాభి ప్రాయం సేకరిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పరిస్థితిని వెల్లడించింది. తాజాగా రాయలసీమ జిల్లా ల్లోని పరిస్థితిని విశ్లేషించింది. వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది. ఏడాది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు సర్వే స్పష్టం చేస్తోంది.

తాజా సర్వే నివేదికలో రాయలసీమలో అత్యధికంగా 33 మంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడించారు. కూటమి కొత్త ఎమ్మెల్యేలకు 29లో కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. సీమ నుంచి అయిదుగురు మంత్రులు ఉన్నారు. వారిలో రెడ్ జోన్ లో నలుగురు మంత్రులు ఉన్నారంటూ సంచలన అంశాలను వెల్లడించింది. చిత్తూరు పార్లమెంటులో కుప్పం, పలమనేరు తప్పితే.. మిగిలినవి కూటమి మర్చిపోవడమే బెటర్.. అంటూ సర్వే ప్రధాన అంశాల్లో పేర్కొంది. ఇక.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయని సర్వేలో స్పష్టం చేసారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది