RK Roja : అధికారం ఉందని ఎగిరెగిరిపడే వాళ్లను ఎగరేసి తంతాం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు..!
RK Roja : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ పర్యటనల్లో ఆయనకు తగిన భద్రత కల్పించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘జెడ్ ప్లస్’ భద్రత కల్పిస్తున్నామని కోర్టులో చెప్పి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం జగన్కు ముప్పు వాటిల్లేలా కుట్రలు చేస్తోందన్న అనుమానాలు తమకు వస్తున్నాయని అన్నారు.
RK Roja : అధికారం ఉందని ఎగిరెగిరిపడే వాళ్లను ఎగరేసి తంతాం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో !
వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెడతారంటూ మండిపడ్డారు. జగన్పై కుట్రలు జరుగుతున్నాయని అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. దాడులు, అక్రమ కేసులకు పాల్పడుతున్న అధికారులను గుర్తించి వారి వివరాలను నమోదు చేయడం కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నామని ప్రకటించారు. వైఎస్ జగన్ భద్రత అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలకు వైసీపీ గురించి చూస్తేనే భయమేస్తోందని, అందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిలను ఇరికించడమూ అందులో భాగమేనని ఆరోపించారు. “ఇప్పుడైతే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎగిరెగిరి పడుతున్నారు. కానీ మేం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు చట్టబద్ధంగా ప్రతీకారం తీర్చుకుంటాం” అని స్పష్టం చేశారు.
Monsoon Detox Drinks : మార్పులు సంభవిస్తే మన శరీరంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే,సీజన్లను బట్టి శరీరం…
Kingdom Movie : టాలీవుడ్ Tollywood లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, vijay devarakonda , bhagya…
Red Food Benefits : కూరగాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి…
Shravana Masam 2025 : మహిళలు ఎంతో ఇష్టంగా శ్రావణమాసంలో ఆధ్యాత్మిక తో భావంతో నిండి,పూజలను చేస్తూ ఉంటారు. అయితే…
Asaduddin Owaisi : భారత్ vs పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆసదుద్దీన్ ఒవైసీ లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా…
Fertility Food : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వివాహం జరిగిన తరువాత మొదట కోరిక తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు.…
Prabhas Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకడు పూరీ జగన్నాథ్…
Kuja Transit : 2025 వ సంవత్సరంలో జూలైలో 28న మొదటి సోమవారం రోజున కుజసంచారం జరిగింది. ఇది శ్రావణ…
This website uses cookies.