Roja : పవన్ కళ్యాణ్ 9 ఏళ్లలో ఏం పీకాడు మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు.. వీడియో !!

 Authored By sekhar | The Telugu News | Updated on :30 July 2023,7:10 pm

Roja : వైసీపీ మంత్రి రోజా ఇటీవల “ఆడదామా ఆంధ్ర” బ్రో కి ఓపెనింగ్ కార్యక్రమాలు గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గెలిస్తేనే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఒక్కోసారి గెలుపు వెంటనే రావచ్చు లేదా కొంత టైం పట్టొచ్చు అని పేర్కొన్నారు. గెలిస్తే చరిత్ర సృష్టించవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ ఆటల పోటీ కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ ప్రతిభను కనబరిచాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇటీవల చంద్రబాబు ఏపీలో నీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై సెటైర్లు వేశారు.

బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇక జనసేన పార్టీ పెట్టి 9 సంవత్సరాలైనా గాని ఇంకా ప్యాకేజీ స్టార్ గానే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. అంత మాత్రమే కాదు పార్టీ పెట్టిన ప్రారంభంలో చంద్రబాబుకు ఓటేయమని చెప్పిన పవన్ రెండోసారి డైరెక్ట్ గా దిగి బొక్క బోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు మరోసారి చంద్రబాబును గెలిపించాలి అన్నట్టుగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా మండిపడ్డారు. లోకల్ బాడీ ఎన్నికలకు పోటీ చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీని గెలిపియడానికి పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని విమర్శించారు.

Roja Comments on pawan kalyan

Roja Comments on pawan kalyan

తొమ్మిదేళ్ల అయింది పార్టీ పెట్టి. పేరుకు పార్టీ పెట్టడమే కానీ.. ప్యాకేజీలకు తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవని సెటైర్లు వేశారు. చంద్రబాబుని గెలిపించాలని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు ప్రజలకు అర్థమవుతుందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ని ఎవరు పట్టించుకోరని అన్నారు.

Advertisement

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి